E-Paper
Advertisement

Prostitution Racket Busted: మైనర్లతో వ్యభిచారం.. డీఎస్పీ సహా ప్రభుత్వ అధికారులు అరెస్ట్.. ఎక్కడంటే..?

Prostitution Racket Busted: మైనర్లతో వ్యభిచారం.. డీఎస్పీ సహా ప్రభుత్వ అధికారులు అరెస్ట్.. ఎక్కడంటే..?
Advertisement

Prostitution Racket Busted in Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ లో అంతర్రాష్ట్ర వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. ఇందులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు రావడంతో.. పోలీసులు ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరెస్ట్ చేశారు. ఈ రాకెట్ లో 15 సంవత్సరాల వయసున్న ఐదుగురు మైనర్లను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. వ్యభిచార రాకెట్ లో అరెస్టైన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కూడా ఉన్నారని వారు తెలిపారు.

క్యాపిటల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) రోహిత్ రాజ్‌బీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటానగర్‌లో బ్యూటీ పార్లర్‌ను నడుపుతున్న ఇద్దరు మహిళలు పొరుగున ఇద్దరు మైనర్లను మాటలతో మభ్యపెట్టి వ్యభిచారానికి రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడికి సమీపంలోని చింపులో మైనర్ బాలికలతో కూడిన వ్యభిచార రింగ్ చురుకుగా ఉందని సమాచారం రావడంతో.. రాజధాని పోలీసు బృందం మే 4న ఇద్దరు మహిళల ఇంటిపై దాడి చేసి.. ఆ ఇద్దరు మైనర్లను రక్షించారు. మే 11న ఇక్కడ సమీపంలోని చింపు వద్ద జూ రోడ్‌లోని లాడ్జి నుండి మరో మైనర్ బాలికను రక్షించారు.

Advertisement

Also Read: రెండు వాహనాలు ఢీ.. 8 మంది మృతి

మైనర్ బాలికలు.. తమను బ్యూటీపార్లర్ నడిపే సిస్టర్స్ ధేమాజీ నుంచి ఇటానగర్ కు తీసుకొచ్చినట్లు చెప్పారు. వారితో పాటు మరో ఇద్దరు మైనర్లను పోలీసులు రక్షించారు. మైనర్లను వ్యభిచారకూపంలోకి దింపుతున్న మహిళలందరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. ప్రస్తుతం బాధిత బాలికలు షెల్టర్ హోమ్‌లలో ఉన్నారని, వారికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వారు సహా మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వ్యభిచార రాకెట్‌లో పాల్గొన్న 10 మందిని, ఐదుగురు ప్రభుత్వ అధికారులతో సహా 11 మంది కస్టమర్‌లను అరెస్ట్ చేసినట్లు సింగ్ తెలిపారు.

Tags

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×