E-Paper
Advertisement

Indore Road Accident: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఇండోర్ లో 8 మంది.. ఒడిశాలో ఆరుగురు మృతి

Indore Road Accident: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఇండోర్ లో 8 మంది.. ఒడిశాలో ఆరుగురు మృతి
Advertisement

Jeep Collided with Vehicle in Indore District: రెండు వాహనాలు పరస్పరం ఢీ కొని.. 8 మంది మృతి చెందిన దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఇండోర్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో ఒక జీపు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. కాగా.. ప్రమాదం అనంతరం గుర్తుతెలియని వాహనం డ్రైవర్ పరారైనట్లు ద్వివేది వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: 160 స్పీడులో కారు, వీడియో తీస్తుండగా దారుణం..నలుగురు మృతి

మరోవైపు.. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని చంపువా ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న కారును రెండు ట్రక్కులు ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. జాతీయ రహదారి 520పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారని, మృతుల్లో ఒక మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×