E-Paper
Advertisement

Indore Road Accident: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఇండోర్ లో 8 మంది.. ఒడిశాలో ఆరుగురు మృతి

Indore Road Accident: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఇండోర్ లో 8 మంది.. ఒడిశాలో ఆరుగురు మృతి

Jeep Collided with Vehicle in Indore District: రెండు వాహనాలు పరస్పరం ఢీ కొని.. 8 మంది మృతి చెందిన దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఇండోర్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో ఒక జీపు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. కాగా.. ప్రమాదం అనంతరం గుర్తుతెలియని వాహనం డ్రైవర్ పరారైనట్లు ద్వివేది వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: 160 స్పీడులో కారు, వీడియో తీస్తుండగా దారుణం..నలుగురు మృతి

మరోవైపు.. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని చంపువా ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న కారును రెండు ట్రక్కులు ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. జాతీయ రహదారి 520పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారని, మృతుల్లో ఒక మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×