Supreme Court: ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుని…వేలాది కుటుంబాలు వీధిన పడటానికి కారణమైన ఆన్ లైన్ గేమింగ్ బెట్టింగులపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. స్కిల్ తో కూడిన ఆటలైనా సరే డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తే రాజ్యాంగ రక్షణ ఉండదని స్పష్టం చేసింది. బెట్టింగ్ వ్యాపారం ఎవ్వరి మౌళిక హక్కు కాదని తేల్చి చెప్పింది. ఆన్ లైన్ బెట్టింగులను నిషేధిస్తూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అమల్లోకి తెచ్చిన చట్టాలు పూర్తిగా చెల్లుతాయని పేర్కొంది.
Also Read: బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా
ఆన్ లైన్ జూదాలను నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోకర్, ఆన్ లైన్ రమ్మీ వంటి యాప్ లలో డబ్బును పందెంగా పెట్టడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఆట ఆడటానికి నైపుణ్యం అవసరమైనా దానిపై డబ్బు పందెంగా పెడితే అది జూదం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. సమాజ హితం, శాంతిభద్రతల దృష్ట్యా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లపై నిషేధం విధించడం సరైందేనని న్యాయస్థానం సమర్థించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిషేధానికి మార్గం సుగమమైంది.
Also Read: ‘తెలంగాణ సెంటిమెంట్.. ఒక ఫ్యాషన్ అయ్యింది’.. బీఆర్ఎస్పై రఘునందన్ రావు ఫైర్