Anganwadi Holidays: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా ఎండలు కొనసాగుతుండటంతో అంగన్వాడీల వేసవి సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి జూన్ 1 వరకు సెలవులు ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలను సెంటర్లకు తీసుకురావడం ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, సెలవులను ఈ నెల 10 లేదా 12వ తేదీ వరకు పొడిగించే యోచనలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Also Read: బెంగాల్లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ
సెలవుల పొడిగింపు అమల్లోకి వస్తే, జూన్ 15 నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలులోకి రానున్నది. ఈ వారం రోజులు కూడా టేక్ హోం రేషన్ పద్దతిలోనే చిన్నారులకు, గర్భిణులకు పోహకాహారాన్ని అందించే అవకాశం ఉంది.ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.