BigTV English
Advertisement

Rahul Gandhi: దేశాన్ని విభజిస్తామంటూ మోదీ తప్పుడు ఆరోపణ.. రాహుల్ గాంధీ క్లారిటీ

Rahul Gandhi: దేశాన్ని విభజిస్తామంటూ మోదీ తప్పుడు ఆరోపణ.. రాహుల్ గాంధీ క్లారిటీ

Rahul Gandhi: సంపద సర్వే వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా ‘సామాజిక-ఆర్థిక సర్వే’ చేపడతామని ప్రకటించింది. అయితే దేశంలో ప్రజల వద్ద ఉన్న బంగారం, సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసి అందరికీ సమానంగా పంపిణీ చేస్తామని చెబుతోందంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగగా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీపై రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు.


ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వే చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. అదే ఈ హామీపై దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్దు దుమారమే చెలరేగింది. ఈ హమీ ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రజలందరి దగ్గర ఉన్న బంగారం సహా.. సంపదను సర్వే చేసి అందరికీ సమానంగా పంపిణీ చేయబోతోందంటూ ప్రధాని మోదీ విమర్శించారు.

మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగిన పార్టీ సామాజిక సమ్మేళన కార్యక్రమంలో తమ హామీపై క్లారిటీ ఇచ్చారు. ఈ సర్వే అనంతరం తాము చర్యలు తీసుకుంటామని చెప్పలేదని.. దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగింది అనేది తెలుసుకోవడానికి సర్వే చేస్తామన్నారు. తాము ప్రజలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంటే.. మోదీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.


తాము చేపట్టబోయే ఆ సర్వేతో అసలు సమస్య ఏంటో, ఎక్కడ ఉందో అందరికీ అర్థం అవుతుందని రాహుల్ గాంధీ వెల్లడించారు. కానీ, తాము మంచి చేయడానికి చూస్తుంటే.. కాంగ్రెస్ దేశాన్ని విభజించడానికి ప్రయత్నాలు చేస్తోంది అంటూ తమపై బురద జల్లేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం దేశభక్తులం అని చెప్పుకునేవారు.. తాము చేపడతామన్న సామాజిక-ఆర్థిక సర్వేతో కూడిన కులగణనకు భయపడుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Also Read: Priyanka attack on Modi: నాటకాలు ఆపు, మంగళసూత్రం విలువ మోదీకి ఏం తెలుసు

కాంగ్రెస్ చేపట్టబోయే కులగణను ఏ శక్తి ఆపలేదని, వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి నిర్ణయం దీనిపైనే ఉంటుందని మరోసారి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో అన్యాయానికి గురైన 90 శాతం మందికి న్యాయం చేయడమే తమ జీవిత లక్ష్యమని రాహుల్ గాంధీ వెల్లడించారు.

Related News

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Big Stories

×