Rahul Gandhi: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ స్పందిచారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మన విద్యా వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ఒక గొప్ప ముందడుగు పడిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులారా, చాలా బాగా చేశారు. మీ అందరి పట్ల మేము గర్విస్తున్నాముని కొనియాడారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, మరియు తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి వీధుల్లోకి వచ్చి దృఢంగా నిలబడిన ప్రతి యువతకు, విద్యార్థికి అనేక అభినందనలు అని రాహుల్ గాంధీ అన్నారు. ఇంకా రెండు డిమాండ్లు మిగిలి ఉన్నాయని ఆయన అన్నారు.
Also read: బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి
విద్యార్థులను, భారతదేశ భవిష్యత్తును గౌరవిస్తూ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని, రైతులు, కార్మికులు, పేదలు, మరియు ఈ ప్రభుత్వం చేత అణచి వేయబడి, అణగదొక్కబడిన ప్రతి ఒక్కరి వంటి సమాజంలోని ఇతర వర్గాల గౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా నిలబడటంలోనే నిజమైన ధైర్యం ఉందని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది భయపడకండి అంటూ తెలినపారు.
Also read: రాజీనామా సరిపోదు.. ఆ డిమాండ్స్ మిగిలే ఉన్నాయ్.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!