Teacher Recruitment: దేశ వ్యాప్తంగా టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కనీస అర్హత లేనివారికి నో ఎంట్రీ అంటూ సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ప్రమాణాలు పాటించకుండా టీచర్లను నియమించడం లేదా సర్వీసులో కొనసాగించడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. RTE, NCTE, UGC. నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.
నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారిని కొత్తగా నియమించడం మాత్రమే కాకుండా.. ఇప్పటికే సర్వీసులో ఉన్న వారిని కూడా కొనసాగించడానికి వీల్లేదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల నియామకాల్లో విద్యార్థుల ప్రయోజనాలు, బోధనా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు పేర్కోంది. ప్రభుత్వ సర్వీసుల్లోకి ఉపాధ్యాయులను విలీనం చేసే పేరుతో పారదర్శకమైన, పోటీతత్వ నియామక ప్రక్రియను పక్కన పెట్టడంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించి ఆదేశాలు జారీ చేసింది.
Also read: తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో విషాదం.. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ పీఏ రాజు మృతి!
ఎలాంటి పారదర్శక నియామక ప్రక్రియ లేకుండా.. అర్హతలు లేని వ్యక్తులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడాన్ని అంగీకరించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. RTE, NCTE, UGC నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉన్నవారినే ఉపాధ్యాయులుగా నియమించాలని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. అర్హత ప్రమాణాలను పాటించకుండా నియామకాలు చేపడితే విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
Also read: నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!