BigTV English

Rahul Gandhi : ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవమే మొదటి ప్రాధాన్యత.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Rahul Gandhi : భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మ గౌరవం తర్వాతే ఏదైనా పతకం, గౌరవం వస్తాయన్నారు. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే ‘బాహుబలి’గా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? అని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వినేశ్ ఫోగాట్ తన పతకాలను ప్రధాని మోదీకి అందజేసేందుకు శనివారం బయలుదేరిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi : ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవమే మొదటి ప్రాధాన్యత.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Rahul Gandhi : భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మ గౌరవం తర్వాతే ఏదైనా పతకం, గౌరవం వస్తాయన్నారు. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే ‘బాహుబలి’గా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? అని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వినేశ్ ఫోగాట్ తన పతకాలను ప్రధాని మోదీకి అందజేసేందుకు శనివారం బయలుదేరిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా ఖేల్‌రత్న, అర్జున అవార్డులను స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ వెనక్కి ఇచ్చేసిన విషయం తెలిసిందే. యావత్‌ దేశానికి సంరక్షకుడైన ప్రధాని ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి కూతురికీ ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యం అన్నారు. ఆ తర్వాతే ఏదైనా అవార్డు అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు.

అంతకు ముందు తనకు వచ్చిన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్న వినేశ్‌ ఫొగాట్‌.. వాటిని ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు శనివారం వెళ్లింది. ఆ క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో వాటిని కర్తవ్యపథ్‌ వద్ద వదిలేసింది. అనంతరం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజయ్‌ సింగ్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ.. అవార్డులను వదులుకుంటానని వినేశ్‌ ఇంతకు ముందే ప్రకటించింది.


ఇదిలా వుండగా డబ్ల్యూఎఫ్‌ఐని క్రీడా మంత్రిత్వ శాఖ ఇది వరకే సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. సమాఖ్యను నడిపించడానికి తాత్కాలిక కమిటీని అంతర్జాతీయ ఒలంపిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Bihar News: బీహార్ ప్రీ-పోల్ సర్వే.. మహా కూటమికి అనుకూలం, ఎన్డీయే కష్టాలు? చివరలో ఏమైనా జరగొచ్చు

Pakistan Prime Minister: భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. మోడీ స్కెచ్ ఏంటి?

Chennai News: పార్టీ తరపున మృతులకు 20 లక్షలు.. టీవీకే నేతలపై కేసులు, విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత

Karur stampede updates: విజయ్ అరెస్టు తప్పదా? పెరుగుతోన్న మృతులు, విచారణకు ఏకసభ్య కమిషన్

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Big Stories

×