BigTV English

Rahul Gandhi : ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవమే మొదటి ప్రాధాన్యత.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Rahul Gandhi : భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మ గౌరవం తర్వాతే ఏదైనా పతకం, గౌరవం వస్తాయన్నారు. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే ‘బాహుబలి’గా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? అని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వినేశ్ ఫోగాట్ తన పతకాలను ప్రధాని మోదీకి అందజేసేందుకు శనివారం బయలుదేరిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi : ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవమే మొదటి ప్రాధాన్యత.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Rahul Gandhi : భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మ గౌరవం తర్వాతే ఏదైనా పతకం, గౌరవం వస్తాయన్నారు. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే ‘బాహుబలి’గా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? అని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వినేశ్ ఫోగాట్ తన పతకాలను ప్రధాని మోదీకి అందజేసేందుకు శనివారం బయలుదేరిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా ఖేల్‌రత్న, అర్జున అవార్డులను స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ వెనక్కి ఇచ్చేసిన విషయం తెలిసిందే. యావత్‌ దేశానికి సంరక్షకుడైన ప్రధాని ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి కూతురికీ ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యం అన్నారు. ఆ తర్వాతే ఏదైనా అవార్డు అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు.

అంతకు ముందు తనకు వచ్చిన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్న వినేశ్‌ ఫొగాట్‌.. వాటిని ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు శనివారం వెళ్లింది. ఆ క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో వాటిని కర్తవ్యపథ్‌ వద్ద వదిలేసింది. అనంతరం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజయ్‌ సింగ్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ.. అవార్డులను వదులుకుంటానని వినేశ్‌ ఇంతకు ముందే ప్రకటించింది.


ఇదిలా వుండగా డబ్ల్యూఎఫ్‌ఐని క్రీడా మంత్రిత్వ శాఖ ఇది వరకే సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. సమాఖ్యను నడిపించడానికి తాత్కాలిక కమిటీని అంతర్జాతీయ ఒలంపిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×