E-Paper
Advertisement

Railway Ticket Rates Hike: పండుగ ముందు రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన టికెట్ ఛార్జీలు

Railway Ticket Rates Hike: పండుగ ముందు రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన టికెట్ ఛార్జీలు

Railway Ticket Rates Hike: భారతీయ రైల్వే ప్రయాణికులకు షాకిచ్చే న్యూస్ చెప్పింది. రైల్వే ప్రయాణ ఛార్జీలు పెంచింది. పెరిగిన ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్‌ చేసేందుకు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఛార్జీలు సవరించినట్లు రైల్వే అధికారులు ప్రకటన చేశారు. లోకల్‌, స్వల్ప దూర ప్రయాణాల టికెట్‌ ధరల్లో ఎలాంటి మార్పుచేయలేదు. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీల కంటే తక్కువ దూరం ప్రయాణాలకు ఛార్జీలు పెంచలేదని రైల్వే శాఖ తెలిపింది. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్డినరీ రైలు టికెట్‌ ధరను కిలో మీటరకు 1 పైసా చొప్పన పెంచింది.

టికెట్ల పెంపుతో రూ.600 కోట్ల ఆదాయం

మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ ఏసీ, నాన్‌-ఏసీ రైళ్లకు కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచారు. నాన్‌ ఏసీ రైళ్లలో 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. ఛార్జీల పెంపుతో రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. డిసెంబర్ 26 నుండి రైల్వేలు ఛార్జీల పెంపు అమల్లోకి రానున్నాయి. సబర్బన్ రైలు ప్రయాణ ఛార్జీలు పెంచనప్పటికీ, దూర ప్రయాణాలు భార ఎక్కువ ఖర్చు అవుతుంది.

215 కిలోమీటర్ల దూరం వరకు జనరల్ క్లాస్ టిక్కెట్ల ధర పెంచలేదు. కానీ 215 కిమీ కంటే ఎక్కువ దూరాలకు కి.మీకి 1 పైసా చొప్పున పెంచారు. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎయిర్ కండిషన్ లేని కోచ్‌లకు, కి.మీకి 2 పైసలు పెంచారు. ఏసీ కోచ్‌లకు కి.మీకి 2 పైసల చొప్పున పెరిగింది. నాన్ ఏసీ కోచ్‌లలో 500 కి.మీ ప్రయాణానికి రూ. 10 అదనపు భారం పడనుంది.

రైల్వే ఖర్చు

భారతీయ రైల్వే ఖర్చులో ఉద్యోగులకు రూ.1,15,000 కోట్లు, పెన్షన్ కు రూ.60,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే కార్యకలాపాలకు మొత్తం రూ.2,63,000 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు, ఈ ఏడాది జులైలో ఛార్జీలు పెంచింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎయిర్ కండిషన్ లేని తరగతిలో ఛార్జీని కి.మీ.కు 1 పైసలు పెంచింది. ఏసీ తరగతుల్లో కి.మీ.కు 2 పైసలు పెంచింది.

Also Read: Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

గతంలో 2020 జనవరి 1న రైలు ఛార్జీలను పెంచారు. 2020లో ఆర్డినరీ, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సెకండ్ క్లాస్ ఛార్జీలు వరుసగా కి.మీ.కు 1 పైసా, 2 పైసలు పెంచింది. స్లీపర్ తరగతులు, అన్ని ఏసీ తరగతుల ఛార్జీలు వరుసగా కి.మీ.కు 2 పైసలు, 4 పైసలు పెరిగాయి.

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×