BigTV English

Railway Luggage Fine: ‘ఇక లగేజిపై ఫైన్ విధిస్తాం’.. రైల్వేశాఖ కీలక ప్రకటన

Railway Luggage Fine: ‘ఇక లగేజిపై ఫైన్ విధిస్తాం’.. రైల్వేశాఖ కీలక ప్రకటన

Railway Luggage Fine| ముంబై నగరంలోని బాంద్రా టర్మినస్ రైల్వే స్టేషన్‌లో రెండు రోజుల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటన తరువాత రైల్వే శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే స్టేషన్లలో పరిమితికి మించి లగేజి తీసుకువస్తే.. ప్రయాణికులకు ఫైన్ విధిస్తామని వెస్టరన్ రైల్వే అధికారికంగా ప్రకటించింది. రైలు ప్రయాణంలో ఉచిత లగేజి పరిమితి మించి ప్రయాణికులు తీసుకురావడం కారణంగా కలుగుతున్న అసౌకర్యం, ఇబ్బందులను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం జారీ చేసిన ప్రకటనలో రైల్వే శాఖ పేర్కింది.


ప్రతి ప్రయాణికుడు పరిమితి మించి ఉచిత లగేజీ తీసుకొని ప్రయాణం చేయకూడదు. లగేజి పరిమితి దాటితే దానికి ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. పైగా లగేజి కొలతలు 100 cm x 100 cm x 70 cm మించకూడదు. ఒకవేళ లగేజి నిర్ణీత కొలతల కంటే ఎక్కువగా ఉన్నా ప్రయాణికులు ఫైన్ చెల్లించాలి. ముఖ్యంగా కొందరు ప్రయాణికులు తమతో సైకిళ్లు, స్కూటర్లు, ఇతర పెద్ద ఆకారం లగేజితో ప్రయాణం చేయడానికి అనుమతి లేదని వెస్టరన్ రైల్వే తెలిపింది.

Also Read:  డిజిటల్ అరెస్ట్ స్కామ్‌తో 4 నెలల్లోనే రూ.120 కోట్లు దోపిడీ.. ప్రభుత్వ నివేదికలో షాకింగ్ వివరాలు


“ప్రయాణికులందరూ రైల్వే స్టేషన్లలో రద్దీ పరిస్థితులను నివారించడానికి సహకరించాలి. ట్రైన్ షెడ్యూల్ సమయంలో రైల్వే స్టేషన్‌లో ప్రవేశించాలి. ప్రయాణికులు లగేజిని పరిమితి స్థాయిలోనే తీసుకొని రావాలి. ప్లాట్ ఫామ్ పై ప్రయాణికులు సజావుగా కదిలేందుకు ఈ చర్యలు పాటించడం చాలా అవసరం. ప్రయాణికులందరూ ఉచిత లగేజి నియమాలను పాటించాలిన కోరుతున్నాం.

ఉచిత లగేజి పరిమితి ఒక్కో క్లాస్ కు వేర్వేరుగా ఉంది. ఉచిత పరిమితికి మించి లగేజి తీసుకువచ్చే ప్రయాణికులకు తప్పకుండా ఫైన్ విధిస్తాం. ఈ నియమాలు వెంటనే అమల్లోకి వస్తాయి. నవంబర్ 8 వరకు స్టేషన్లలో రద్దీ నివారించడానికి ప్రయాణికులు అన్ని నియమాలు పాటించాలి” అని రైల్వే శాఖ తెలిపింది.

మరోవైపు దీపావళి, భాయిదూజ్ పండుగల రీత్యా రైల్వే స్టేషన్లలో పార్శిల్ బుకింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ముంబైలోని బాంద్రా టర్మినస్, వాపి, వల్సాడ్, సూరత్, ఉధ్నా స్టేషన్ల పార్శిస్ కార్యాలయాల్లో బుకింగ్స్ సంఖ్య గణనీయంగా పెరిపోయిందని రైల్వే శాఖ తెలిపింది. ప్లాట్ ఫామ్ పై ఈ పార్శిళ్లు ఉండడంతో ప్యాసింజర్లు సజావుగా స్టేషన్ లో నడిచేందుకు ఇవి అడ్డంగా మారయని.. ప్యాసింజర్ల భద్రతా, సౌకర్యలాను దృష్టిలో ఉంచుకొని.. ట్రైన్ డిపార్చర్ సమయం కంటే ముందుగా చాలా సేపు పార్శిళ్లు ప్లాట్ ఫామ్‌పై ఉంచకూడదని అధికారులకు ఆదేశించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

అక్టోబర్ 27, 2024 ఆదివారం రోజున.. ముంబైలోని బాంద్రా టర్మినస్ స్టేషన్లో ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్ కు వెళ్లే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ లో ఎక్కడానికి దాదాపు వెయి మందికి పైగా ప్రయాణికులు ఒక్కసారిగా ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికుల కాళ్లు, భుజాలు, వెనెముక భాగాల్లో ఫ్రాక్చర్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

దీపావళి పండుగకు స్వగ్రామాలకు వెళ్లాలనే క్రమంలో ప్యాసింజర్లు ఆత్రుతగా ట్రైన్ లో సీటు కోసం పోటీపడడంతో ఈ ఘటన జరిగింది. దీంతో రైల్వే శాఖ నవంబర్ 8 వరకు రైల్వే స్టేషన్లలో రద్దీ సమస్య నివారించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×