Himachal Pradesh latest update(Today’s news in telugu):
హిమాచల్ ప్రదేశ్ గడ్డకట్టింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మంచు కురవడం ప్రారంభమైంది. ప్రకృతి అందాలకు తోడు ఇప్పుడు ఈ స్నో ఫాల్ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూమతి మిగుల్చుతోంది. శీతాకాలం ప్రారంభంకాకవడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. భారీగా మంచువర్షం కురుస్తుండటంతో కొండ ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి
మనాలి, సిమ్లా సహా అన్ని పర్యాటక ప్రాంతాలపై మంచు కురుస్తోంది. మనాలి పట్టణం సహా సోలాంగ్ నాలా, అటల్ టన్నెల్, రోహత్తంగ్ పాస్ చుట్టూ మంచు కురిసింది. హిమపాతం కారణంగా పలు దారులను సైతం మూసివేశారు. మరోవైపు ఈ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు.. ప్రమాదకరమైన ప్రాంతాల వైపు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సాధారణంగానే హిమాచల్ ప్రదేశ్ చల్లగా ఉంటుంది. ఇప్పుడు పర్వతాలలో మంచు కురుస్తున్న కారణంగా మరింత చల్లగా మారింది. గురువారం ఉదయం నుంచి సిమ్లా మేఘావృతమై ఉంది. హిమపాతాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిమ్లా నగరాన్ని 5 సెక్టార్లుగా విభజించింది. ప్రతి సెక్టార్లో SDM స్థాయి అధికారులను నియమించారు. ఆసుపత్రికి వెళ్లే రహదారులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. మంచు కారణంగా పర్యాటకుల రాక పెరిగింది.