BigTV English

Alluri Sitaramaraju: కోతుల కోసం ఉచ్చు.. ట్రాప్ లో పడి చిరుత మృతి

Alluri Sitaramaraju: కోతుల కోసం ఉచ్చు.. ట్రాప్ లో పడి చిరుత మృతి

Alluri Sitaramaraju : ఎరక్కపోయి ఇరుక్కుపోయిందో చిరుత. ఉచ్చులో చిక్కింది. పంట పొలాలను కోతులు నాశనం చేస్తుండటంతో వాటిని తట్టుకోలేక ఏర్పాటు చేసిన ట్రాప్‌లో పడింది. విలవిల్లాడిన చిరుతపులి చివరకు ప్రాణాలు కోల్పోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల సమీపంలో జరిగిందీ ఘటన.


ఎల్లవరం-రేగులపాడు మధ్య పొలాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. గుర్తుతెలియని వ్యక్తులు కోతుల కోసం ఉచ్చు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి పొలాల్లోకి ప్రవేశించిన చిరుత ఆ ఉచ్చులో చిక్కుకుంది. తీగ దాని నడుముకు బిగిసుకుపోయింది. దాన్నుంచి బయటపడేందుకు అది ప్రయత్నించగా.. చెట్టుపై ఉన్న ఓ వలలో చిక్కుకుంది. దీంతో కిందకు వేలాడిపోయింది. కొన్ని గంటల పాటు ఉండిపోయింది. గురువారం ఉదయం పొలానికి వెళ్తుండగా.. ఓ రైతు పులి చిరుతను చూశాడు. స్థానికులకు విషయం చెప్పడంతో అటవీశాఖకు సమాచారం వెళ్లింది. అప్పటికి అది బతికే ఉంది. రంపచోడవరం డీఎఫ్‌వో నరేంద్రన్‌ ఆధ్వర్యంలో దాన్ని ట్రాప్ నుంచి, వల నుంచి బయటకు తీశారు. నీరు తాగించారు. విశాఖపట్నం జూ పార్క్‌ నుంచి రెస్క్యూ టీం వచ్చి చిరుతను బోనులోకి ఎక్కించారు. కొద్దిసేపటికే అది చనిపోయింది.

చిరుతకు నడుము ఉచ్చు బిగుసుకోవడంతో.. కింద భాగానికి రక్త సరఫరా ఆగిపోయిందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. చిరుతకు కిడ్నీలు ఫెయిల్‌ అయిపోయినట్టు పంచనామాలో గుర్తించారు. మరోవైపు విశాఖ జూ పార్క్ నుంచి రెస్క్యూ టీం ఆలస్యంగా రావడం వల్లే చిరుత మృతి చెందిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి చిరుతపులి ఉచ్చులో చిక్కుకుంటే.. గురువారం ఉదయానికి అటవీ అధికారులు వచ్చినా.. సాయంత్రం 3న్నర గంటల వరకు రెస్క్యూ టీం రాలేదని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఈ ఆలస్యం వల్లే చిరుత ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని అంటున్నారు. రెస్క్యూ టీం వచ్చేటప్పటికి చిరుత ప్రాణాలతో ఉండేదని.. ముందుగా వచ్చి ఉంటే బతికే అవకాశం ఉండేదని స్థానికులు చెప్తున్నారు.


Related News

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

Big Stories

×