BigTV English
Advertisement

Rajiv Gandhi Case Convict Santhan : రాజీవ్‌ హత్య కేసు దోషి శాంతన్ గుండెపోటుతో మృతి.. శ్రీలంకకు మృతదేహం తరలింపు!

Rajiv Gandhi Case Convict Santhan : రాజీవ్‌ హత్య కేసు దోషి శాంతన్ గుండెపోటుతో మృతి.. శ్రీలంకకు మృతదేహం తరలింపు!

 


Santhan

Rajiv Gandhi Case Convict Santhan Died: భారత్ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా ఉన్న శాంతన్ మృతి చెందాడు. 55 ఏళ్ల శాంతన్ శ్రీలంక దేశీయుడు. అతడికి సుతేంద్ర రాజా అనే మరో పేరు కూడా ఉంది. రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన తర్వాత చాలాకాలం జైలులో ఉన్న అతడు.. 2022లో విడుదలయ్యాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బయటకు వచ్చాడు. అప్పటి నుంచి తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని స్పెషల్ శిబిరంలో ఉంటున్నాడు.


శాంతన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. లివర్ ఫెయిల్యూర్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పటల్ లో చికిత్స పొందాడు. ఈ క్రమంలో గుండెపోటు గురయ్యాడు. బుధవారం ఉదయం శాంతన్ మరణించాడని డాక్టర్లు ప్రకటించారు.

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన 1991 మే 21న జరిగింది. ఆ రోజు థను అనే ఎల్టీటీఈ ఉగ్రవాది సూసైడ్ బాంబర్ గా మారింది. ఆ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో సహా 14 మంది మరణించారు.

Read More: ఈడీ సమన్లకు వ్యక్తులు తప్పనిసరిగా హాజరు కావాలి.. సుప్రీం కీలక ఆదేశాలు..

రాజీవ్ హత్య కేసు దర్యాప్తు సుధీర్ఘకాలం సాగింది. ఏడుగురు నిందితులు న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అందులో పేరరివాళన్ , శాంతన్ , మురుగన్ ఈ ముగ్గురు దోషులకు విధించిన మరణశిక్షను 2014లో న్యాయస్థానం జీవితఖైదుగా మార్చింది. ఆ తర్వాత 8 ఏళ్లకు సుప్రీంకోర్టు ఆదేశాలతో శాంతన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు శ్రీలంక చెందినవాడు కావడంతో మృతదేహాన్ని అక్కడికి తరలించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×