E-Paper
Advertisement

Rajiv Gandhi Case Convict Santhan : రాజీవ్‌ హత్య కేసు దోషి శాంతన్ గుండెపోటుతో మృతి.. శ్రీలంకకు మృతదేహం తరలింపు!

Rajiv Gandhi Case Convict Santhan : రాజీవ్‌ హత్య కేసు దోషి శాంతన్ గుండెపోటుతో మృతి.. శ్రీలంకకు మృతదేహం తరలింపు!

 

Santhan

Rajiv Gandhi Case Convict Santhan Died: భారత్ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా ఉన్న శాంతన్ మృతి చెందాడు. 55 ఏళ్ల శాంతన్ శ్రీలంక దేశీయుడు. అతడికి సుతేంద్ర రాజా అనే మరో పేరు కూడా ఉంది. రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన తర్వాత చాలాకాలం జైలులో ఉన్న అతడు.. 2022లో విడుదలయ్యాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బయటకు వచ్చాడు. అప్పటి నుంచి తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని స్పెషల్ శిబిరంలో ఉంటున్నాడు.

శాంతన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. లివర్ ఫెయిల్యూర్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పటల్ లో చికిత్స పొందాడు. ఈ క్రమంలో గుండెపోటు గురయ్యాడు. బుధవారం ఉదయం శాంతన్ మరణించాడని డాక్టర్లు ప్రకటించారు.

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన 1991 మే 21న జరిగింది. ఆ రోజు థను అనే ఎల్టీటీఈ ఉగ్రవాది సూసైడ్ బాంబర్ గా మారింది. ఆ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో సహా 14 మంది మరణించారు.

Read More: ఈడీ సమన్లకు వ్యక్తులు తప్పనిసరిగా హాజరు కావాలి.. సుప్రీం కీలక ఆదేశాలు..

రాజీవ్ హత్య కేసు దర్యాప్తు సుధీర్ఘకాలం సాగింది. ఏడుగురు నిందితులు న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అందులో పేరరివాళన్ , శాంతన్ , మురుగన్ ఈ ముగ్గురు దోషులకు విధించిన మరణశిక్షను 2014లో న్యాయస్థానం జీవితఖైదుగా మార్చింది. ఆ తర్వాత 8 ఏళ్లకు సుప్రీంకోర్టు ఆదేశాలతో శాంతన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు శ్రీలంక చెందినవాడు కావడంతో మృతదేహాన్ని అక్కడికి తరలించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×