E-Paper
Advertisement

Rajnath Singh: చైనాకు చెంపదెబ్బ, పాక్ కి చెప్పుదెబ్బ.. అంతర్జాతీయ వేదికపై రాజ్ నాథ్ ఉగ్రరూపం

Rajnath Singh: చైనాకు చెంపదెబ్బ, పాక్ కి చెప్పుదెబ్బ.. అంతర్జాతీయ వేదికపై రాజ్ నాథ్ ఉగ్రరూపం

పాకిస్తాన్ కుటిల బుద్ధి, వారికి వంత పాడే చైనా దుష్టబుద్ధి.. ఈ ఇద్దరి కుతంత్రాన్ని అంతర్జాతీయ వేదికపైనే తిప్పికొట్టారు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. షాంఘై సహకార సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఆయన.. భారత్ కి మచ్చ తెచ్చేలా తయారు చేసిన జాయింట్ డాక్యుమెంట్ ని తిరస్కరించారు. దానిపై సంతకం పెట్టేందుకు నిరాకరించారు. దీంతో చైనా సహా, ఆ సమావేశానికి హాజరైన ఇతర దేశాల ప్రతినిధులు షాకయ్యారు. జాయింట్ డాక్యుమెంట్ తయారీ వివాదాస్పదంగా మారింది.

అసలేం జరిగింది..?
చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ ఓ సదస్సు నిర్వహించింది. దీంట్లో సభ్య దేశాల రక్షణ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. భారత్, చైనా, పాకిస్తాన్ సహా మొత్తం 10 సభ్య దేశాల మంత్రులు పాల్గొన్నారు. ఇందులో పహల్గాం దాడి, తదనంతర పరిస్థితుల్ని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. సీమాంతర ఉగ్రవాదం గురించి కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఎలా ఎదుర్కొందో చెప్పారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతిస్తున్నాయని, ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని కూడా వివరించారు. శాంతి కాముక దేశాలు ఉగ్రవాదానికి దూరంగా ఉండాలన్నారు. శాంతి, శ్రేయస్సు అనేవి ఉగ్రవాదంతో కలసి ఉండలేవన్నారు. కొన్ని దేశాలు ద్వంద్వ వైఖరిని పాటిస్తున్న తీరుని ఆయన అంతర్జాతీయ వేదికపై ఎండగట్టారు.

సంతకం చేయను..
సదస్సు అనంతరం దాని సారాంశాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేశారు నిర్వాహకులు. ఈ సంయుక్త ప్రకటనలో రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావించిన అంశాలకు చోటు లేకపోవడం విశేషం. అదే సమయంలో బలూచిస్తాన్ వేర్పాటు వాదం గురించి మాత్రం అందులో ఉంది. ఆ విషయాన్ని పాకిస్తాన్ ప్రస్తావించగా, యథాతథంగా జాయింట్ డూక్యుమెంట్ లో పొందుపరిచారు. ఇక్కడ నిర్వాహకుల ద్వంద్వ వైఖరి స్పష్టమైంది. ఈ జాయింట్ డాక్యుమెంట్ ని చదివి వినిపించిన తర్వాత సభ్య దేశాల రక్షణ మంత్రుల సంతకాలను కోరారు. అయితే రాజ్ నాథ్ సింగ్ ఆ డాక్యుమెంట్ ని తిరస్కరించారు. భారత్ పై జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావించకుండా, సీమాంతర ఉగ్రవాదం గురించిన అంశాలు లేకుండా డాక్యుమెంట్ రూపొందించడంపై ఆయన మండిపడ్డారు. ఇక్కడ కూడా ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం సరికాదంటూ నిర్వాహకులకు హితవు పలికారు. దీంతో సంయుక్త ప్రకటనను షాంఘై సహకార సంస్థ రద్దు చేసింది.

సంతకం చేసేది లేదంటూ రాజ్ నాథ్ సింగ్ చెప్పడంతో చైనా షాకైంది. సంతకం చేయకుండా రాజ్ నాథ్ సింగ్ ఒకేసారి అటు చైనాకు, ఇటు పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పారని అంటున్నారు. ఈ సదస్సులో భారత వైఖరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చైనా, పాక్ కి ఇటువంటి గుణపాఠం చెప్పాల్సిందేనంటున్నారు. అంతర్జాతీ వేదికపై వారి చర్యలను ఖండించడం సరైన చర్య అంటూ రాజ్ నాథ్ సింగ్ కి మద్దతుగా నిలిచారు. భారత్ కు మద్దతుగా నెటిజన్లు సోషల్ మీడియాలో సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×