E-Paper
Advertisement

Rajya sabha election 2024: 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌.. విపక్షాలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం

Rajya sabha election 2024: 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌.. విపక్షాలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం
Advertisement

Rajya sabha election for 15 seats

Rajya sabha election for 15 seats: సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 56 స్థానాలకు గాను ఇప్పటికే 41 మంది నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 10, హిమాచల్‌ ప్రదేశ్‌లో 1, కర్ణాటకలో 4 మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ మొదలైన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురిని బరిలోకి దింపడంతో ఒక సీటుపై గట్టి పోటీకి జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Advertisement

Read More: మెట్రోలో రైతుకు నో ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో

కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్, మాజీ ఎంపీ చౌదరి తేజ్వీర్ సింగ్, సీనియర్ రాష్ట్ర నాయకుడు అమర్‌పాల్ మౌర్య, మాజీ మంత్రి సంగీత బల్వంత్ (బైంద్) పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్‌లను బీజేపీ బరిలోకి దింపింది.

సమాజ్‌ వాదీ పార్టీ నుంచి ఎంపీ జయాబచ్చన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్, దళిత నేత రామ్‌జీ లాల్ సుమన్‌లను రంగంలోకి దింపింది. మరోవైపు కర్ణాటకలో, అధికార కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను సోమవారం ఒక ప్రైవేట్ హోటల్‌కు తరలించింది. పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం లేదని రాష్ట్ర పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొట్టిపారేశారు.

Related News

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

Big Stories

Advertisement
×