E-Paper
Advertisement

Satyam Scam: సత్యం కుంభకోణం కేసు.. సెబీ కీలక ఉత్తర్వులు

Satyam Scam: సత్యం కుంభకోణం కేసు.. సెబీ కీలక ఉత్తర్వులు
Satyam Scam case update

Satyam Scam case update(Telugu breaking news today):

సత్యం కుంభకోణం కేసులో సెబీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన మొత్తాన్ని సత్యం రామలింగరాజుతో పాటు మరో నలుగురు నుంచి వసూలు చేయడానికి నిర్ణయించింది. ఈ నలుగురు 624 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందారని.. ఈ మొత్తాన్ని వడ్డీ సహా చెల్లించాలని సెబీ 96 పేజీల ఉత్తర్వలు జారీ చేసింది. సత్యం రామలింగరాజుతోపాటు రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్‌, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకే చెందిన SRSR హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు కూడా ఈ కేసులో బాధ్యత ఉందని సెబీ స్పష్టం చేసింది.

సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌లో 2009 జనవరి 7న ఖాతాల కుంభకోణం వెలుగు చూసింది. కంపెనీ లావాదేవీల విషయంలో తప్పుడు లెక్కలు చూపినట్టు రామలింగరాజు అంగీకరించారు. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో ఈ తప్పుడు లెక్కలతో ఈ ఐదుగురు భారీగా లాభపడినట్లు సెబీ తేల్చింది. కాబట్టి 624 కోట్ల రూపాయల అసలుతో పాటు.. 2009 జనవరి 7 నుంచి 12 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.

Tags

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×