E-Paper
Advertisement

Tejashwi on Modo Comments: చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు: భావోద్వేగంతో తేజస్వీ!

Tejashwi on Modo Comments: చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు: భావోద్వేగంతో తేజస్వీ!

Tejashwi Yadav Respond to PM Modi Comments: ఆర్జేడీ నాయకుడు భావోద్వేగంతో తేజస్వీ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజస్థాన్ లోని బాన్స్ వారాలో ఆదివారం నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఫైరయ్యాయి. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే చొరబాటుదారులకు, అధికంగా పిల్లలు ఉన్నవారికి సంపదంతా దోచిపెడుతుందన్న మోదీ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపాయి.

ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే అసత్యాలు మాట్లాడుతున్నారంటూ ఫైరయ్యారు. అదేవిధంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం స్పందించి ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాని మోడీకి చేతులు జోడించి చెబుతున్నా.. సమస్యలపై మాట్లాడండి. అంతేకానీ, విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్నారు. దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుందని, చాలామంది పేదరికం నుంచి బయటపడేందుకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా ప్రజలు నిత్యావసర ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

Also Read:సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్..

గత పదేళ్లలో మీరు దేశానికి ఏం చేశారో చెప్పాలని.. ముఖ్యంగా బీహార్ కు ఏం చేశారు చెప్పాలని తేజస్వీ యాదవ్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. దేశాభివృద్ధికి, బీహార్ అభివృద్ధికి మీ విజన్ ఏంటో స్పష్టంగా వివరించాలి కానీ, అనవసర వ్యాఖ్యలు చేయొద్దన్నారు. దేశంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు ప్రధాని అలా మాట్లాడుతున్నారని తేజస్వీ యాదవ్ అన్నారు.

ప్రధాని వ్యాఖ్యలపై తేజస్వీ యాదవ్ భావోద్వేగంతో స్పందించారు. ఇటు మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో ఫైరయ్యాయి. ప్రధాని మోదీ అలా మాట్లాడడం సరికాదన్నారు. మోదీ తీవ్ర అసంతృప్తితోనే అలా మాట్లాడుతున్నారని వారు అన్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×