E-Paper
Advertisement

Lok Sabha Results: యూపీలో షాకింగ్ ఫలితాలు.. బీజేపీ మ్యాజిక్ పని చేయలేదా?

Lok Sabha Results: యూపీలో షాకింగ్ ఫలితాలు.. బీజేపీ మ్యాజిక్ పని చేయలేదా?
Advertisement

Uttar Pradesh Election results(Politics news today India): ఢిల్లీలో అధికార పీఠాన్ని అధిరోహించాలంటే ఉత్తరప్రదేశ్ గుండా వెళ్లాలని చమత్కరిస్తుంటారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా 80 సీట్లు ఉన్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మెరుగైన ఫలితాలను రాబట్టింది. ప్రధాని మోదీ స్వయంగా యూపీలోని వారణాసి నుంచి రెండు సార్లు ఘనవిజయాన్ని నమోదు చేశారు. బీజేపీకి రాజకీయ కేంద్రంగా ఉత్తరప్రదేశ్ ఉంటుంది. రామాలయం వంటి సున్నితమైన అంశాన్ని ఆయుధంగా రాజకీయాలు చేసే ఈ పార్టీకి యూపీ ముఖ్యమైన రాష్ట్రం. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ నాయకులు పలుమార్లు రామ మందిర ప్రస్తావన తెచ్చారు. కానీ, ఈ సారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తన పట్టును కోల్పోతున్నట్టు కనిపిస్తున్నది. ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఇండియా కూటమి అనుకున్నదానికంటే అద్భుతమైన ఫలితాలను రాబట్టుతున్నది.

ఉత్తరప్రదేశ్‌లో తొలి రౌండ్‌లలో ఇండియా కూటమి.. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ ఒంటరిగా బీజేపీని కట్టడి చేస్తున్నదని అర్థమవుతున్నది. యూపీలో 80 పార్లమెంటు స్థానాల్లో ఫలితాల సరళి ఇలా ఉన్నది. ఎన్నికల సంఘం వెబ్ సైట్ ప్రకారం 80 సీట్లల్లో బీజేపీ 35 స్థానాల్లో, సమాజ్‌వాదీ 34 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇండియా కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీయే కూటమి 38 సీట్లల్లో ముందంజలో ఉన్నది. అనూహ్యంగా ఇక్కడ బీఎస్పీ ఒక్క సీటులోనూ ఆధిక్యంలో లేదు.

Advertisement

కాగా, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రౌండ్‌లలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై వెనుకబడ్డారు. రాహుల్ గాంధీ ఈ సారి అమేథీలో కాకుండా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి బరిలో నిలిచి లీడ్‌లో ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని అమేథీలో ఓడించి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్మృతి ఇరానీ ప్రస్తుతం ఈ స్థానంలో వెనుకంజలో ఉన్నది. అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ ముందంజలో ఉన్నారు.

2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి 64 సీట్లు గెలుచుకుంది. ఇందులో 62 స్థానాలను బీజేపీ గెలిచింది.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×