E-Paper
Advertisement

సింగర్ అంకిత్ దారుణ హత్య.. జిమ్ నుంచి బయటకు వస్తుండగా, కాల్చి చంపిన ప్రత్యర్థులు, యూపీలో ఘటన

సింగర్ అంకిత్ దారుణ హత్య.. జిమ్ నుంచి బయటకు వస్తుండగా, కాల్చి చంపిన ప్రత్యర్థులు, యూపీలో ఘటన
Advertisement

Singer Murdered: గాయకుడు అంకిత్ దారుణహత్యకు గురయ్యాడు. జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపారు. దాదాపు 20 రౌండ్లపాటు సింగర్‌పై కాల్పులు జరిపారు. దీంతో స్పాట్‌లో సింగర్ మృతి చెందాడు. ఇంతకీ సింగర్‌కు నేపథ్యం ఏంటి? హత్య చేయడానికి కారణాలేంటి?

 

యూపీలోని షామ్లీలో దారుణం, సింగర్ అంకిత్ హత్య

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో దారుణం జరిగింది. హర్యానా గాయకుడు అంకిత్ బలియాన్‌ను ప్రత్యర్థులు కాల్చి చంపారు. బుధవారం సాయంత్రం ఆయన జిమ్ నుండి బయటకు వస్తుండగా 20 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు దుండగులు. దీంతో అంకిత్ తల, కడుపు భాగంలో ఐదు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆయన మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 

జిమ్ నుంచి బయటకు వస్తుండగా కాల్చి చంపిన దుండగులు

Advertisement

హర్యానా సంగీత పరిశ్రమలో విషాదకరమైన ఘటన. భారీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్ అనే హిట్ సాంగ్‌తో ఫేమస్ అయ్యాడు. ఓ వైపు సింగర్‌గా రాణిస్తూ.. మరోవైపు నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు అంకిత్ బలియాన్. యూపీలోని షామ్లీలో బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో జిమ్‌ నుంచి బయటకు వస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన నలుగురు దుండగులు కాల్పులు జరిపారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆ దుండగులు నడుస్తూ తుపాకులు పట్టుకున్నట్లు చెబుతున్నారు. దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపారు. అంకిత్ స్వస్థలం షామ్లీ జిల్లాలోని బంతిఖేడా గ్రామానికి చెందినవాడు. కొన్ని సంవత్సరాలుగా సింగర్‌గా కాకుండా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం హర్యానాలోని రోహ్‌తక్- సోనిపత్‌ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాడు.

 

20 రౌండ్లు కాల్పులు, అక్కడిని నిందితులు పరార్

గడిచిన ఏడాదిగా అంకిత్ క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్తున్నాడు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. హత్య వెనుక పాత కక్షలు లేదా ముఠా పోరాటాలు కారణమని భావిస్తున్నారు.

ఘటన గురించి తెలియగానే అంకిత్ కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు.  మృతదేహాన్ని షామ్లీ కూడలిలో ఉంచి నిరసనకు దిగారు. హంతకులను అరెస్టు చేసే వరకు రోడ్డుపై ఉంటామని తెగేసి చెప్పారు. ఈలోగా పోలీసులు అధికారులు వచ్చి వారికి సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు.  అంకిత్ జిల్లా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాల్పుల వెనుక అతని రాజకీయ నిర్ణయం కారణమా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

ALSO READ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జాబ్స్.. కనీసం జీతం రూ.1 లక్ష

Related News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జాబ్స్.. కనీసం జీతం రూ.1 లక్ష

నేపాల్ విపత్తు.. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తుల గల్లంతు

కూల్ డ్రింక్స్‌లో చక్కెర ట్రిపుల్.. ప్యాకెట్లలో కొవ్వు డబుల్.. దేశాన్ని ఊబకాయం వైపు తోస్తున్న ప్యాకేజ్డ్ ఫుడ్స్!

నేపాల్లో అకస్మిక వరదలు.. 16 మంది మృతి.. 105 మంది భారతీయులు గల్లంతు!

భయపెడుతున్న హెచ్‌1ఎన్‌1 కేసులు.. మళ్లీ మాస్కులు తప్పవా?

అడవి పందితో.. 14 ఏళ్ల బాలుడి విరోచిత పోరాటం.. 90 నిమిషాలు హోరాహోరీ ఫైట్!

ఆస్పత్రిలో విచిత్రం.. సైలెంట్‌గా వచ్చి.. రూ.4 లక్షలు ఎత్తుకెళ్లిన వీధి కుక్క!

Big Stories

Advertisement
×