E-Paper
Advertisement

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Sunil Ahuja: దేశంలో ఐటీ దాడులతో రకరకాల ఏజెంట్లు భయం పడుతున్నారా? తప్పించుకునేందుకు కొందరు దేశం వదిలి పారిపోయారా? మరికొందరు మకాం మార్చేశారా? వారిలో హవాలా మనీ ఏజెంట్లు ఉన్నారా? అవుననే అంటున్నారు అధికారులు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రేపో మాపో కొందరు అరెస్టు కావచ్చని ఓ అంచనా.

కోట్లాది రూపాయల సైబర్​ ఫ్రాడ్​ కేసులపై ఈడీ దృష్టి పెట్టింది. కోట్లాది రూపాయలను దేశం దాటించినట్టు గుర్తించిందట. ఈ క్రమంలో బుధవారం దేశంలోని ఢిల్లీ, నొయిడా, గురుగావ్​, డెహ్రాడూన్ సహా మొత్తం 11 చోట్ల దాడులు చేసింది. వీటికి సంబంధించి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్​ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల విదేశాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతోంది ఓ సైబర్ క్రిమినల్ గ్యాంగ్. తాము పోలీసు అధికారులంటూ ఎంఎన్‌సీ కంపెనీలై మైక్రోసాఫ్ట్, ఆమెజాన్ సంస్థల టెక్నికల్​ ఏజెంట్లమని చెప్పి వందలాది మందిని నమ్మించారు. వారి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ విధంగా లూటీ చేసిన నిధులను బిట్ కాయిన్స్​‌గా మార్చినట్టు గుర్తించారని తెలుస్తోంది.

నిధులను అమెరికన్ డాలర్లుగా మార్చి హవాలా ద్వారా దుబాయి వంటి దేశాలకు చేర్చినట్టు ఆధారాలు లభించాయి. ఏకంగా 260 కోట్ల రూపాయల ఆస్తులు విదేశాలకు వెళ్లినట్టు గుర్తించింది సీబీఐ. వాటిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ గ్యాంగ్ భారత్‌తోపాటు కొన్నిదేశాల్లో ఇలాంటి మోసాలు పాల్పడినట్టు తేలింది. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్​ జారీ చేశారు.

ALSO READ: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు

నగదు తరలింపులో భారీగా మనీ లాండరింగ్​ కు పాల్పడినట్టు గుర్తించారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు కోసం వేట మొదలైంది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉందన్నది ఈడీ వర్గాల మాట. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయన్నారు. ఈ విషయం తెలియగానే సునీల్‌కుమార్ అహూజా వంటి వారు దేశం విడిచినట్టు తెలుస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు.

ఏపీ లిక్కర్ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ద్వారా సేకరించిన ముడుపులను సునీల్ అహుజా ద్వారా దుబాయ్, అమెరికాలకు హవాలా ద్వారా పంపినట్టు సిట్ అధికారులు గుర్తించారట. దీనికి సంబంధించి వారి ఆచూకీ కోసం సిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ఈడీ కూడా హవాలా గ్యాంగ్‌పై కన్నేయడంతో పట్టుబడతామని భావించిన సునీల్ సైలెంట్‌గా దేశం విడిచినట్టు అధికారుల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×