BigTV English
Advertisement

Supreme Court : అశ్లీల కంటెంట్.. ఆ సైట్లన్నీ బ్యాన్?

Supreme Court : అశ్లీల కంటెంట్.. ఆ సైట్లన్నీ బ్యాన్?

Supreme Court : స్టాండప్ కామెడీ. అన్నీ బూతులే. వెబ్ సిరీస్‌లు చాలావరకు A గ్రేడ్ కంటెంటే. సినిమాల్లోనూ అశ్లీలమే. ఓటీటీ నిండా కుప్పలు తెప్పలు.. కావలసినంత గలీజ్ వీడియోలు. అదే ఇంపుగా అనిపిస్తుంది చాలామందికి. చూస్తే రోత పుడుతుంది సభ్య సమాజానికి. అలాంటి అసభ్య కంటెంట్‌తో జనం చెడిపోతున్నారనే ఆవేదన కొందరిలో. అలాంటి వాళ్లంతా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఆఛండాలాన్ని అరికట్టాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఓటీటీ, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే, పూర్తి స్థాయిలో సెన్సార్‌షిప్ సాధ్యం కాకపోయినా.. నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయి.


సుప్రీంకోర్టు సీరియస్

అసభ్యకరమైన కంటెంట్‌ ప్రసారం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలపై కూడా ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది. ఈ కంటెంట్ వికృత, అసహజ లైంగిక ధోరణులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీ, సోషల్‌ మీడియా నియంత్రణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.


కేంద్రానికి నోటీసులు

ఓటీటీ, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించాలంటూ.. సుప్రీంకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. జర్నలిస్ట్, మాజీ సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్, సంజీవ్ నెవార్, సుదేష్ణ భట్టాచార్య ముఖర్జీ, శతాబ్ది పాండే, స్వాతి గోయల్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషనర్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తన వాదనలు వినిపించారు. ఎటువంటి నియంత్రణ, తనిఖీలు లేకుండా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కంటెంట్ అంశాన్ని హైలైట్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

కంట్రోల్.. కంట్రోల్..

ఇప్పటికే కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయని.. భవిష్యత్తులో మరిన్ని నిబంధనలు అమలు చేస్తామని సోలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. కొన్ని సాధారణ కార్యక్రమాల్లో కూడా అశ్లీల కంటెంట్ ఉందని అంగీకరించారు. ఇద్దరు గౌరవనీయులైన వ్యక్తులు కలిసి కూర్చుని వాటిని చూడలేరని ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్‌షిప్ ఉండకూడదని అంగీకరిస్తూనే, కొంత నియంత్రణ అవసరమని సొలిసిటర్ జనరల్ అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆల్ట్‌ బాలాజీ, ఉల్లు డిజిటల్, ముబి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎక్స్ కార్ప్, గూగుల్, మెటా ఇంక్, ఆపిల్‌ వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

Related News

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

Big Stories

×