E-Paper
Advertisement

Delhi Water Crisis: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. కార్లు కడిగితే రూ.2 వేలు ఫైన్

Delhi Water Crisis: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. కార్లు కడిగితే రూ.2 వేలు ఫైన్

Delhi Water crisis: ఢిల్లీలో ఎండల కారణంగా తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టాలని ప్రభుత్వం ఢిల్లీ జల బోర్టును ఆదేశించింది.
ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి నీటి వనరులను దుర్వినియోగం చేసేవారిని తనిఖీ చేయడంతో పాటు జరిమానా విధించడానికి బృందాలను మోహరించనున్నారు.

నీటి వృథా కేసులను పర్యవేక్షించడానికి, తగ్గించడానికి 200 బృందాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ జల మంత్రి అతిషి ఢిల్లీ జల బోర్డు సీఈవోను ఆదేశించారు. ఈ బృందాలు నివాస ప్రాంతాల్లో పైపులోని నీటితో కార్లను కడగడం, నీటి ట్యాంకులు పొంగిపొర్లడం, నీటిని వాణిజ్య అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తే వారికి జరిమానా విధిస్తారు. హర్యానా ప్రభుత్వం ఈ నెలలో ఢిల్లీకి కేటాయించిన నీటి వాటా అందించడం లేదని అతిషి మంగళ వారం ఆరోపించగా నేడు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మే 1న వజీరాబాద్‌లో 674.5 నీటిమట్టం ఉండగా, ఇప్పుడు 669.8కి పడిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడిందని ఆమె తెలిపారు. ఢిల్లీలోని ఆరు నీటి శుద్ధి ప్లాంట్లలో వజీరాబాద్‌లో ఒకటి ఉంది. ఢిల్లీ నీటి వృథాను అరికట్టేందుకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

Also Read: మండే అగ్నిగోళంలా ఉత్తరాది రాష్ట్రాలు.. రాజస్థాన్ లో 50 డిగ్రీల ఎండ

ఉదయం 8 గంటల నుంచి ఈ బృందాలు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ నీటి వృథాపై దృష్టి సారిస్తాయి.
ప్రజలు సహకరించాలని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా లేక పోవడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నీటిని వృథా చేయకూడదని నీటిని పొదుపు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×