E-Paper
Advertisement

Seven killed in landslide of Karnataka: కారులో వెళ్తుండగా మీదపడ్డ కొండ.. ఏడుగురు మృతి

Seven killed in landslide of Karnataka: కారులో వెళ్తుండగా మీదపడ్డ కొండ.. ఏడుగురు మృతి
Advertisement

Seven People killed in landslide in Karnataka: కర్ణాటకలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. అదేవిధంగా మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

ఉత్తర కన్నడ జిల్లాలోని శిరూర్ పట్టణ శివారులో రహదారిపై వెళ్తున్న కారుపై మంగళవారం భారీగా కొండచరియలు విరిగి మీద పడ్డాయి. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

విషయ తెలుసుకున్న అగ్నిమాపక శాఖ, ఎమర్జెన్సీ సర్వీసెస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్నారు. మరికొన్ని వాహనాలు, టీ షాప్ పై కూడా కొండచరియలు పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో పలువురు టీ తాగుతున్నారని తెలిపారు. వారిలో చాలామంది ఆచూకీ కనిపించడంలేదని సమాచారం.

Also Read: నితీష్ కుమార్ డిమాండ్స్‌లో న్యాయం ఉందా? ఎన్నికల స్టంటా?

Advertisement

స్థానిక ఎంపీ విశ్వేశ్వర హెగ్డే మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడినట్లు కమిషనర్ చెప్పారని, వారి మృతిపట్ల ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

Tags

Related News

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Big Stories

Advertisement
×