E-Paper
Advertisement

Tigers : భారత్ లో పులులు గాండ్రింపు.. దేశంలో ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Tigers : భారత్ లో పులులు గాండ్రింపు.. దేశంలో ఎన్ని ఉన్నాయో తెలుసా..?
Advertisement

Tigers : దేశంలో ఏటా పులుల సంఖ్య పెరుగుతోంది. 2022 నాటికి పులుల సంఖ్య 3,167కు చేరింది. కర్ణాటక మైసూరులో ప్రాజెక్ట్‌ టైగర్‌ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పులుల తాజాగా లెక్కలు వెల్లడించారు. అఖిల భారత పులుల అంచనా నివేదికను విడుదల చేశారు.

ప్రధాని చెప్పిన వివరాలు ప్రకారం..దేశంలో పులుల సంఖ్య 2006లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022లో 3,167గా ఉంది. భారత్‌ కేవలం పులులను సంరక్షించడమే కాకుండా.. వాటి సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ విజయవంతం కావడం కేవలం యావత్‌ ప్రపంచానికి గర్వకారణమని అన్నారు.

Advertisement

అంతర్జాతీయ పులల కూటమిని మోదీ ప్రారంభించారు. ఈ కూటమి ప్రపంచవ్యాప్తంగా ఏడు రకాల పులుల సంరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. పులుల సంరక్షణ కార్యక్రమం విజయానికి చిహ్నంగా రూ.50 స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. అమృత్‌ కాల్‌లో పులుల సంరక్షణకు సంబంధించిన ప్రణాళికను మోదీ విడుదల చేశారు. ప్రకృతిని రక్షించడం భారత సంస్కృతిగా పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పులలలో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయని వివరించారు.

ప్రపంచ భూభాగంలో భారత్‌ వాటా 2.4 శాతంగా ఉన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ప్రపంచ జీవవైవిధ్యంలో 8 శాతం వాటా భారతదేశానిదని తెలిపారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. దాదాపు 30 వేల ఏనుగులతో ప్రపంచంలోనే అత్యధిక ఆసియా ఏనుగులు ఉన్న దేశంగా భారత్‌ నిలిచిందని తెలిపారు.

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×