E-Paper
Advertisement

Womens Reservation Bill : కేంద్రం కీలక నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం..

Womens Reservation Bill : కేంద్రం కీలక నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం..
Advertisement
Womens Reservation Bill

Parliament special session updates(Latest political news in India):

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల వేళ ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను నెరవేర్చే ధైర్యం మోదీ సర్కారుకే ఉందన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువైందని తెలిపారు.

Advertisement

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనూ బిల్లును ప్రవేశ పెట్టినప్పటినా.. ఆమోదానికి నోచుకోలేదు. చివరగా ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులో ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దకావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది.

ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలో కేబినెట్‌ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే రాజ్యసభను శాశ్వత సభగా పిలుస్తారు. అక్కడ ఆమోదం పొందిన ఏ బిల్లు కూడా మురిగిపోదు. లోక్‌సభ ఆమోదించి, పెద్దలసభ ఓకే చేయకపోతే మాత్రం.. లోక్‌సభ పదవీకాలం పూర్తైతే ఆ బిల్లు మురిగిపోయినట్టే. కానీ మహిళా బిల్లు విషయంలో మాత్రం రాజ్యసభ 2010లోనే ఆమోదించింది కాబట్టి.. ఇప్పుడు లోక్‌సభ మూడింట రెండొంతుల మెజార్టీతో గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే సరిపోతుంది. రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాలుస్తుంది.

Advertisement

ప్రతి ఒక్క పార్టీ మహిళ బిల్లుకు మద్దతిస్తుంది. కానీ పార్లమెంట్‌లో మాత్రం ఎందుకు ఆమోదం పొందదు? ఇప్పటికి 27 ఏళ్లు గడిచిపోయాయి. దాదాపు మూడు దశాబ్దాలు. చివరగా 2008లో సమాజ్‌వాదీ పార్టీ, RJD, JDU సభలో వ్యతిరేకించాయి. పబ్లిక్‌లో మాత్రం ఈ మూడు పార్టీలు అనుకూలమనే చెప్తాయి. బిల్లులోని కొన్ని టర్మ్స్‌పై అభ్యంతరమని చెప్తూ వస్తున్నాయి. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీకి 303 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలకు తోడు కొన్ని తటస్థ పార్టీలు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో మూడింట రెండొంతుల మెజార్టీతో మహిళా బిల్లుకు మోక్షం కలిగిస్తుందా?

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×