E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: ప్రారంభమైన రెండోదశ ఎన్నికల పోలింగ్..

Lok Sabha Elections 2024: ప్రారంభమైన రెండోదశ ఎన్నికల పోలింగ్..
Advertisement

Lok Sabha Elections: పార్లమెంటు ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో మొత్తం 13 రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇందులో మొత్తం 88 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1.67 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ స్టేష్లన్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ పోలింగ్ లో మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కర్ణాటక, రాజస్థాన్, కేరళ, త్రిపుర, ఛత్తీస్ గఢ్, అస్సాం, బీహార్, పశ్చిమబెంగాల్, మణిపూర్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు.

Advertisement

Also Read:7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో మే 13న పోలింగ్..

అయితే.. రెండోదశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కీలకంగా మారింది. ఎందుకంటే కేరళలోని వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ, బీజేపీ నుంచి కె. సురేంద్రన్, సీపీఐ నాయకురాలు అన్నీ రాజాతో పాటు పలువురు కీలక నేతలు పోటీ పడుతున్న స్థానాల్లో ఈరోజే పోలింగ్ జరగనున్నది. ఈ క్రమంలో రెండో దశ పోలింగ్ కీలకంగా మారింది.

Advertisement

ఇప్పటికే తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరుగగా 65.5 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. అయితే, రెండో దశ పోలింగ్ లో ఓటర్లు ఎంతమేరకు పోలింగ్ శాతాన్ని పెంచుతారో అనేది ఈరోజు తేలిపోనుంది.

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

Big Stories

Advertisement
×