BigTV English

Two Farmers were killed by Elephant: విషాదం.. మహిళా రైతుతోపాటు మరొకరిని చంపేసిన ఏనుగు?

Two Farmers were killed by Elephant: విషాదం.. మహిళా రైతుతోపాటు మరొకరిని చంపేసిన ఏనుగు?

Two Farmers were killed by Elephant: ఇటీవల తెలంగాణలోని కుమురం భీం జిల్లాకు చెందిన ఇద్దరు రైతులపై దాడి చేసి చంపేసిన ఏనుగు మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు రైతులను కూడా పొట్టనబెట్టుకుంది. ఇటీవల కుమురం జిల్లాలో ఏనుగు భయానక వాతావరణం సృష్టించి మహారాష్ట్ర బాట పట్టిన విషయం తెలిసింది. అయితే, మహారాష్ట్రలో కూడా మరో ఇద్దరు రైతులపై దాడి చేసి వారిని కూడా బలి తీసుకుంది.


ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భామ్రఘడ్ కియర్ గ్రామ శివారులోని పంట చేనులో పనులు చేస్తున్న గిరిజన రైతుపై దాడి హతమార్చిందని.. అక్కడి నుంచి హద్దురు గ్రామానికి వెళ్లి అక్కడ చేనులో పనులు చేసుకుంటున్న మహిళా రైతుపై దాడి చేయగా.. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం.దీంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలవారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఇదే ఏనుగు ప్రాణహిత నది దాటి కుమురం భీం జిల్లాలో భయానక వాతావరణం సృష్టించింది. పంట పొలాల్లో పని చేస్తున్న ఇద్దరు రైతులపై దాడి చేసి హత్య చేసిన విషయం విధితమే. అయితే, ఇదే ఏనుగు మహారాష్ట్రలో కూడా మరో ఇద్దరిపై దాడి చేసి హత్య చేయడంతో మహారాష్ట్రకు చుట్టుపక్కల ఉన్న తెలంగాణ గ్రామాల్లో అధికారులు దండోరా వేయించినట్లుగా తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు, రైతులకు సూచించినట్లుగా సమాచారం.


Also Read:ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×