E-Paper
Advertisement

Thackeray Criticizes Election Schemes: ఆ స్కీములన్నీ మూలకు పడేసేటివే: ఉద్ధవ్ థాక్రే

Thackeray Criticizes Election Schemes: ఆ స్కీములన్నీ మూలకు పడేసేటివే: ఉద్ధవ్ థాక్రే

Uddav Thackeray fire Shinde govt woman schemes: శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల మీటింగ్ లో ఉద్ధవ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతమున్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే సర్కారు మహిళల కోసం ప్రకటిస్తున్న పథకాలపై ఆయన మండిపడ్డారు. ఆ స్కీములన్నీ కూడా త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత మూలకు పడేసే స్కీములంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యవసరంగా చాలా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇది కేవలం ఎన్నికల ముందు మహిళల ఓట్ల కోసం చేసే రాజకీయ స్టంట్ మాత్రమే అంటూ ఆయన ఫైరయ్యారు. ఆ స్కీములు రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినా.. రాకపోయినా ఆ స్కీములను అమలు చేయరన్నారు.

Tags

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×