E-Paper
Advertisement

Gaza-Starvation : గాజాకు ఆకలిచావుల ముప్పు

Gaza-Starvation : గాజాకు ఆకలిచావుల ముప్పు
Advertisement

Gaza-Starvation : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఆరంభమై ఏడోవారం. ఉత్తర గాజా పూర్తిగా వశం కావడంతో.. ఇజ్రాయెల్ బలగాలు దక్షిణ గాజాపై దాడులకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే గాజాలో 45% మేర ఆవాసాలు నేలమట్టమయ్యాయి. తాజాగా శనివారం ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడింది.

ఈ దాడుల్లో 26 పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులే అధికం. ఆహారం అందే మార్గం లేక గాజా పౌరులు ఆకలిచావులకు గురయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ఆందోళన చెందుతోంది. ఇంధనం లేక ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసులు స్తంభించిపోవడంతో.. గాజాకు ఆహారం, ఇతర నిత్యావసరాల సరఫరాను బలవంతంగా నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొందని ఐరాస అధికారులు వాపోయారు.

Advertisement

ఐరాస బృందంతో పాటు టెలికమ్యూనికేషన్ల వ్యవస్థల పునరుద్ధరణ కోసం రెండు టాంకర్ ట్రక్కుల ఇంధనాన్ని అందజేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇది ఎంత మాత్రం సరిపోదని సహాయక బృందాలు వాపోతున్నాయి.
గాజాపై సైనిక చర్య కారణంగా ఇప్పటికే 12000 మందికిపైగా మరణించారు. వారిలో 5 వేల మంది చిన్నారులేనని హమాస్ ప్రకటించింది. మరో 3750 మంది ఆచూకీ తెలియడం లేదు. వారంతా శిథిలాల్లో కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఉత్తర గాజాను ఇప్పటికే 1.6 మిలియన్ల మంది ప్రాణాలు అరచేత పట్టుకుని దక్షిణ గాజాకు తరలిపోయారు. ఓ వైపు వలసలు పెరగడం, మరోవైపు ఆహార సరఫరాకు ఆటంకాలు కలుగుతుండటంతో ఆకలికి అలమటించే దుస్థితి నెలకొనవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Related News

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

Big Stories

Advertisement
×