E-Paper
Advertisement

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఐదు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, అవి ఏంటంటే..?

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఐదు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, అవి ఏంటంటే..?
Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ఐదు ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ కేటాయింపులు వ్యవసాయం, ఇంధనం, రవాణా రంగాల్లో భారీ మార్పులకు నాంది పలకనున్నాయి. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మేలు చేకూర్చేలా కేంద్రం పెద్దపీట వేసింది.

ముందుగా వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ ఖరీఫ్ సీజన్ నూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) కోసం ప్రభుత్వం రూ. 41,534 కోట్లను కేటాయించింది. ఎరువుల లభ్యత పెంచడంతో పాటు సామాన్య రైతులకు తక్కువ ధరలకే పోషకాలు అందజేయడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. దీనివల్ల సాగు వ్యయం తగ్గి రైతులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.

Advertisement

ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా రాజస్థాన్‌లో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టుకు రూ. 79,459 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ రిఫైనరీ నిర్మాణం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పశ్చిమ భారత ప్రాంతంలో పెట్రో కెమికల్ ఉత్పత్తుల సరఫరా మెరుగుపడటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

పట్టణ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా జైపూర్ మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి రూ. 13,038 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రయాణ కష్టాలను తీర్చడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. జైపూర్ నగరంలో కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడం దీని ప్రధాన లక్ష్యం.

Advertisement

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. నార్త్ ఈస్ట్‌లో కమల హైడ్రో పవర్ ప్లాంట్స్ స్థాపన కోసం రూ. 26,070 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జల విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆ ప్రాంతంలోని విద్యుత్ డిమాండ్‌ను తీర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ప్రకృతి సిద్ధమైన ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో కీలక అడుగు అవుతుంది.

వీటితో పాటు మరో రెండు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల కోసం రూ. 14,106 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే క్రమంలో ఈ భారీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తాజా కేబినెట్ నిర్ణయాలు దేశీయ మౌలిక సదుపాయాల కల్పనలో మైలురాయిగా నిలవనున్నాయి.

ALSO READ: ఇన్నాళ్లకు మేలుకొన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×