E-Paper
Advertisement

Dharmendra Pradhan: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..

Dharmendra Pradhan: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..
Advertisement

Dharmendra Pradhan Called Off his Event: ఇంటర్నేషనల్ యోగా డే రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. యోగా డే వేడుకు ఢిల్లీ యూనివర్శిటీకి వచ్చిన ఆయనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలపడంతో వేడుక రద్దు చేసుకుని వెనుదిరిగారు.

యోగా డే సందర్భంగా ఢిల్లీ యూనివర్శిటీలోని వేడుకలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరవ్వడానికి వస్తుండగా విద్యార్థులు ఆయనకు నల్ల జెండాలు ప్రదర్శించారు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), యూజీసీ-నెట్‌కు సంబంధించిన ఇటీవలి కుంభకోణాలపై వారు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. దీంతో చేసేదేమిలేక మంత్రి వెనుదిరిగారు.

Advertisement

కాగా గురువారం ధర్మేంద్ర ప్రధాన్ యూజీసీ నెట్ పేపర్ లీకేజీ అంశంపై స్పందించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థాగత వైఫల్యంగా పేర్కొన్నారు. ఎన్టీయే పనితీరును పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తుందని అన్నారు. అలాగే వ్వవస్థలో అవసరమయ్యే సంస్కరణలను సిఫార్సు చేస్తుందని అన్నారు. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్, యూజీసీ-నెట్ రద్దుపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

Tags

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×