BigTV English

NEET PG 2024: నీట్‌ పీజీ నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు

NEET PG 2024: నీట్‌ పీజీ నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు

NEET PG 2024: నీట్‌ పీజీ-2024 పరీక్ష నిర్వహణపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లోను, ఇటు అభ్యర్థుల్లోను గందరగోళం నెలకొంది. అయితే తాజాగా ఈ విషయమై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఈ మేరకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షను రిషెడ్యూల్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


కాగా, ఎన్టీఏ( నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)లో ఇప్పటికే కొత్త అధికారులు చేరారు. నీట్ పరీక్షలను నిర్వహించే బాధ్యతలను ఎన్టీఏ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే పేపర్ లీకేజీపై ఆరోపణలు రావడంతో ఎన్టీఏలో అధికారులను మార్పులు చేశారు. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేయగా ఈ మార్పులు చేర్పులు జరిగాయి. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు వెల్లడించారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో నీట్ పరీక్ష నిర్వహణపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ధర్మేంద్ర అన్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పేపర్ లీకేజీపై చర్చను కాంగ్రెస్ అడ్డుకుంటుందని అన్నారు. నిందితులను తప్పించాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు. అభ్యర్థులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం తరపున తాను ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు.


Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×