E-Paper
Advertisement

Uttar Pradesh: తీవ్ర విషాదం.. కుప్పకూలిన పెద్ద భవనం.. ఎనిమిది మంది మృతి!

Uttar Pradesh: తీవ్ర విషాదం.. కుప్పకూలిన పెద్ద భవనం.. ఎనిమిది మంది మృతి!
Advertisement

Building Collapses In Meerut: ఉత్తరప్రదేశ్‌లో విషాదం నెలకొంది. మీరట్‌లోని జాకీర్ కాలనీలో ఓ మూడంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

భారీ వర్షాలు కురవడంతో భవనం కూలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భవనం శిథిలాల కింద చిక్కుకున్న 11మందిని రక్షించారు. ఈ ఘటనలో పలు జంతువులు కూడా చనిపోయాయి. కాగా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.

Advertisement

ఈ భవనం దాదాపు 35ఏళ్ల క్రితం నిర్మించగా..ఆ భవనం శిథిలావస్థకు చేరడంతోపాటు వర్షం కారణంగా కూలిపోయి ఉంటుందని రెస్క్యూ సిబ్బంది అనుమానిస్తున్నారు.

Also Read: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు!

Advertisement

ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×