E-Paper
Advertisement

Uttar Pradesh: తీవ్ర విషాదం.. కుప్పకూలిన పెద్ద భవనం.. ఎనిమిది మంది మృతి!

Uttar Pradesh: తీవ్ర విషాదం.. కుప్పకూలిన పెద్ద భవనం.. ఎనిమిది మంది మృతి!

Building Collapses In Meerut: ఉత్తరప్రదేశ్‌లో విషాదం నెలకొంది. మీరట్‌లోని జాకీర్ కాలనీలో ఓ మూడంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

భారీ వర్షాలు కురవడంతో భవనం కూలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భవనం శిథిలాల కింద చిక్కుకున్న 11మందిని రక్షించారు. ఈ ఘటనలో పలు జంతువులు కూడా చనిపోయాయి. కాగా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఈ భవనం దాదాపు 35ఏళ్ల క్రితం నిర్మించగా..ఆ భవనం శిథిలావస్థకు చేరడంతోపాటు వర్షం కారణంగా కూలిపోయి ఉంటుందని రెస్క్యూ సిబ్బంది అనుమానిస్తున్నారు.

Also Read: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు!

ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×