E-Paper
Advertisement

Uttarakhand Tunnel Collapse : నాలుగు రోజులుగా ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులు!

Uttarakhand Tunnel Collapse : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న టన్నెల్(సొరంగం) కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ సొరంగంలో 40 మంది కార్మికులు అప్పటి నుంచి చిక్కుకుపోయి ఉన్నారు.

Uttarakhand Tunnel Collapse : నాలుగు రోజులుగా ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులు!
Advertisement

Uttarakhand Tunnel Collapse : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న టన్నెల్(సొరంగం) కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ సొరంగంలో 40 మంది కార్మికులు అప్పటి నుంచి చిక్కుకుపోయి ఉన్నారు.

ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా ఆ శిథిలాల కింద 40 మంది కార్మికలని సహాయక సిబ్బంది బయటికి తీయలేక పోతోంది. వాళ్లను బయటకు తీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అధికారుల తెలిపారు.

Advertisement

ఈ క్రమంలోనే కొందరు వర్కర్స్‌ ఘటనా స్థలం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమ తోటి కార్మికులను బయటకు తీయాలంటూ నినాదాలు చేశారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తామని అధికారులు హామీ ఇస్తున్నప్పటికీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు ఆలస్యం అవుతోందంటూ అసహనంతో ప్రశ్నించారు.

ఈ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులకు సూచించారు. లోపల చిక్కుకున్న కార్మికుల కోసం ఆక్సిజన్ ఏర్పాట్లు చేశామని.. అలాగే డ్రిల్లింగ్ మెషీన్‌లతో శిథిలాలను కట్ చేసి 900 మిల్లీమీటర్ల వెడల్పు గల పైపుల సహాయంతో లోపల ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Advertisement

శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 10 మంది ఝార్ఖండ్ వాసులూ ఉన్నారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఈ అంశంపై అన్ని విధాలుగా అండగా ఉంటామని కార్మికుల కుటుంబాలకు హామీ ఇచ్చారు.

Related News

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

Big Stories

Advertisement
×