E-Paper
Advertisement

Cheetah: చిరుతా చిరుతా ఎందుకు చనిపోతున్నావ్?

Cheetah: చిరుతా చిరుతా ఎందుకు చనిపోతున్నావ్?
Cheetah

Cheetah: మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో చిరుతపులుల మృత్యువాత కొనసాగుతోంది. నాలుగు నెలల కాలంలో ఏకంగా ఎనిమిది చిరుత పులులు మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా సూరజ్‌ అనే మరో చిరుత మృతి చెందింది. రెండు రోజుల క్రితం తేజస్ అనే మగ చీతా మృతి చెందింది. సూరజ్ చిరుత ఎలా చనిపోయిందో ఇంతవరకు తెలియలేదు. ఆ చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో ఒకటైన తేజస్ అనే మగ చిరుత మంగళవారం మృతి చెందింది. అయితే ఈ చిరుత మెడపై గాయాలున్నాయి.

ప్రాజెక్ట్ చితాలో భాగంగా కేంద్రం రెండో దఫాల్లో దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి 20 చిరుతలను భారత్‌కు తీసుకొచ్చింది. అయితే ఇందులో ఆరు చిరుతపులులు ఇప్పటికే మృతి చెందాయి. మరో రెండు చిరుత పులుల పిల్లలు పుట్టగానే మరణించాయి. మార్చ్‌ 27న సాష, ఏప్రిల్‌ 23న ఉదయ్, మే 9న దక్ష, మే 25న అప్పుడే పుట్టిన రెండు చిరుత పులులు మృతి చెందాయి. ఇందులో కొన్ని అనారోగ్య కారణాలతో మృతి చెందగా.. మరికొన్ని పరస్పరం దాడులు చేసుకొని మృతి చెందాయి. ఇక రెండు చిరుత పిల్లలు మాత్రం వాతావరణం సహకరించకపోవడంతో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

అయితే చిరుతపులుల మృతిపై దక్షిణాఫ్రికా వైల్డ్‌ లైఫ్‌ ఎక్స్‌పర్ట్‌ విన్సెంట్‌ ముందుగానే ఊహించారు. రానున్న రోజుల్లో మరికొన్ని చిరుతలు మృతి చెందుతాయని ఆయన ముందుగానే హెచ్చరించారు. నేషనల్ పార్క్‌లో చిరుత పులులు తమ సరిహద్దులను నిర్ణయించుకునే విషయంలో, పరస్పరం ఎదురుపడినప్పుడు జరిగే దాడుల్లో మృతి చెందుతాయని ఆయన తెలిపారు.

అయితే చిరుతపులులను సంరక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నేషనల్ పార్క్‌ అధికారులు చెబుతున్నారు. దేశంలో చిరుతపులుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మొదటి బ్యాచ్‌ చీతాలను కూనో నేషనల్ పార్క్‌లోకి వదిలారు. అయితే వరుసగా చిరుతల మృతితో కేంద్రం ఆశయానికి గండిపడుతుంది. వరుసగా చిరుత పులులు మృతి చెందడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×