E-Paper
Advertisement

Wife Sleeping PIlls Husband: భర్త, పిల్లలుండగా ఆమెకు ఇద్దరు ప్రియులు.. కుటుంబానికి భోజనంలో విషం కలిపి

Wife Sleeping PIlls Husband: భర్త, పిల్లలుండగా ఆమెకు ఇద్దరు ప్రియులు.. కుటుంబానికి భోజనంలో విషం కలిపి
Advertisement

Wife Sleeping PIlls Husband| వివాహం చేసుకొని అత్తమామలు, భర్త, ఇద్దరు పిల్లలతో చక్కని కాపురం చేసుకుంటున్న ఓ మహిళ కోరికలకు బానిసై.. పెద్ద ఘాతుకానికి పాల్పడింది. అప్పటికే ఆమెకు ఒక ప్రియుడుండగా.. మరో ప్రియుడిని సెట్ చేసుకుంది. తనపై ముందునుంచి అనుమానం పడే భర్తకు ఈ విషయం తెలిసిపోతుందని భయపడి ఇంట్లో అందరికీ భోజనంలో స్లో పాయిజన్ కలిపి ఇచ్చింది. ఇలా చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. కానీ బ్యాడ్ లక్ ఆమె బండారం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో నివసించే చైత్ర అనే ఓ 33 ఏళ్ల మహిళ.. తన కుటుంబ సభ్యులకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి చంపేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. చైత్ర హాసన్ జిల్లా బేలూరు తాలూకాకు చెందిన గజేంద్రను 11 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Advertisement

చైత్ర తన వివాహేతర సంబంధాన్ని రహస్యంగా ఉంచాలని కోరుకుంది. ఈ కారణంగానే ఆమె తన భర్త, పిల్లలు, అత్తమామల కుటుంబ సభ్యుల భోజనంలో నిద్రమాత్రలు కలపడం ప్రారంభించింది. ఈ పనిలో ఆమె ప్రియుడు శివు సహాయం చేశాడు. అతనే ఆమె కోసం నిద్రమాత్రలు తీసుకొచ్చేవాడు. అయితే, ఒక రోజు చైత్ర పర్సులో నిద్రమాత్రలు చూసిన ఆమె భర్త గజేంద్ర.. ఈ హత్యాయత్నాన్ని గుర్తించి, బేలూరు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు చైత్రను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహం జరిగి 11 ఏళ్లు గడిచినా.. మూడు సంవత్సరాల క్రితమే చైత్ర, గజేంద్ర మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరూ చిన్న చిన్న విషయాలపై తరచూ గొడవలు పడేవారు. ఈ సమయంలో చైత్రకు పునీత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం గజేంద్రకు తెలియడంతో ఈ విషయాన్ని చైత్ర తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ సమయంలో అందరిముందు అవమానభారంతో చైత్ర తన ప్రియుడిని వదిలేసింది. కానీ చైత్ర బుద్ధి మాత్రం మారలేదు. ఆమె బేలూరుకు చెందిన శివు అనే మరో వ్యక్తి,తో కొత్తగా ప్రేమాయాణం ప్రారంభించింది.

Advertisement

కానీ తన కొత్త ప్రేమ వ్యవహారం గురించి గజేంద్రకు తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో చైత్ర తన కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకుంది. శివు సహాయంతో ఆమె ఈ దారుణమైన పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నించింది. ఆమె భోజనంలో నిద్రమాత్రలు కలిపి, కుటుంబ సభ్యులను చంపేందుకు సిద్ధమైంది. అయితే, గజేంద్ర సకాలంలో ఈ పథకాన్ని గుర్తించడంతో ఈ దారుణం జరగకుండా అడ్డుకున్నాడు. చైత్రను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమె ప్రియుడు శివును కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశమైంది. చైత్ర కేసులో.. దారుణ పథకం వెనుక ఉన్న పూర్తి కారణాలను, ఇతర సహాయం ఎవరైనా చేశారా అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: శోభనం రోజు రాత్రి ఏం జరిగింది? ‘హనీమూన్’ ఘటనలో ఊహించని ట్విస్ట్

ఇలాంటిదే ఒక కేసు కేరళలో జరిగింది. “సైనైడ్ కిల్లర్” కేసు పేరుతో అది ఫేమస్. ఆ కేసులో జాలీ జోసెఫ్ అనే మహిళ 14 సంవత్సరాల పాటు ఆరుగురు కుటుంబ సభ్యులను కొద్ది కొద్దిగా విషం ఇచ్చి చంపింది. చివరికి ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×