OTT Movie : భారతదేశపు మొట్టమొదటి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ జీవితం, అతని మిస్టరీ డెత్ ఆధారంగా ఓ థ్రిల్లర్ సిరీస్ రూపొందింది. ఈ థ్రిల్లర్ సిరీస్ మరి కొద్ది గంటల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. గౌరవ్ మరణం చుట్టూ ఉన్న వివాదాలతో ఈ సిరీస్ ఉత్కంఠంగా ముందుకు వెళ్తుంది. అతని జీవితంలో అతని పారానార్మల్ ప్రయాణం, మరణం మధ్య ఉన్న సీక్రెట్స్ ని ఇది విశ్లేసిస్తుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. ట్రైలర్ లోనే ఈ సిరీస్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక మొత్తం సిరీస్ చూస్తే అంతే సంగతులు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి వస్తుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ సూపర్ నేచురల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘భయ్’ (Bhay). దీనికి రాబీ గ్రెవాల్ దర్శకత్వం వహించారు. ఇందులో కరణ్ టాకర్, కల్కి కోచ్లిన్, డానిష్ సూద్, సలోని బాత్రా లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2025 డిసెంబర్ 12 నుంచి Amazon MX Playerలో ప్రసారం అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులోకి వస్తోంది.
గౌరవ్ తివారీ తన పైలట్ వృత్తిని వదులుకుని, దెయ్యాలు, ఆత్మల ఉనికిని శాస్త్రీయంగా పరిశోధించే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అవతారం ఎత్తుతాడు. అతని జీవితంలో ఎదురైన భయంకరమైన కేసులను ఈ సిరీస్ వివరిస్తుంది. అతని వింత నిర్ణయాల కారణంగా కుటుంబ సభ్యులు పడిన ఆందోళనలు, అతనికి ఎదురైన ప్రమాదకరమైన పరిస్థితులను సిరీస్ మొదటి భాగంలో చూపించడం జరిగింది. ఈ కథలోకి ఐరీన్ వెంకట్ అనే జర్నలిస్ట్ ఎంట్రీ ఇస్తుంది. ఐరీన్ మొదట్లో గౌరవ్ చేసే పరిశోధనలను మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తుంది. కానీ 2016లో కేవలం 32 ఏళ్ల వయసులో గౌరవ్ తన ఇంట్లోనే మర్మమైన పరిస్థితులలో చనిపోతాడు. అతని మరణం ఆత్మహత్యగా అందరూ నిర్ధారిస్తారు.
Read Also : వేశ్య వెంట పడే బిజినెస్మ్యాన్… రాత్రికి మాత్రమే ఛాన్స్ అంటూ… సింగిల్స్ కు పండగే