Crime Thriller OTT : రీసెంట్ గా వచ్చిన సీక్రెట్ స్టోరీస్ రోస్లిన్ మలయాళ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్ జానర్ తో ఈ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇక ఇది ఇలా నడుస్తుండగానే మరో మలయాళ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది నకిలీ పాస్పోర్టుల తయారీ, మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన కథ. డబ్బు సంపాదించాలని ఇద్దరు కజిన్స్ చేసే ప్రయత్నాలు, వాళ్ళను ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి ఎలా నెట్టాయి అనే అంశాన్ని ఇందులో చూపించారు. మరి ఈ సిరీస్, ఎప్పుడు ? ఎక్కడ ? స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.
ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘కాసరగోడ్ ఎంబసీ’ (Kasaragod Embassy). ఈ సిరీస్ 2026 మార్చి 20 నుండి ZEE5 ఓటీటీ ప్లాట్ఫారమ్లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 7 ఎపిసోడ్లతో ఉన్న ఈ సిరీస్ కు అతీష్ ఎం. నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్లో అబు సలీమ్, గోవింద్ పై, కబీర్ దుహాన్ సింగ్, సుదీష్, దీపక్ పరంబోల్, రోనీ డేవిడ్, ఉమా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కాసరగోడ్ అనే చిన్న ఊర్లో ఉండే ఇద్దరు బావమరుదులు, ఎలాగైనా విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని కలలు కంటారు. కానీ వాళ్ళ దగ్గర సరైన దారి లేదు, అంతకన్నా డబ్బులు కూడా ఉండవు. ఈ క్రమంలోనే వాళ్ళు నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసే ఒక పెద్ద గ్యాంగ్ ఉచ్చులో పడతారు. గల్ఫ్ వెళ్లాలనే ఆశతో వీళ్ళు చేసే పనులు, చివరకు వాళ్ళని తెలియకుండానే ఒక ప్రమాదకరమైన క్రైమ్ నెట్వర్క్లోకి తీసుకెళ్తాయి. ఒక్కసారి ఆ అక్రమ రవాణా బురదలో దిగాక, అక్కడి నుండి బయటపడటం అంత ఈజీ కాదని వాళ్ళకి అర్థమవుతుంది. పోలీసులు ఒక పక్క, లోకల్ గుండాలు ఇంకో పక్క వీళ్ళ కోసం వేట మొదలుపెడతారు. అసలు ఆ నకిలీ పాస్పోర్ట్ రాకెట్ వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఈ ఇద్దరు మామూలు కుర్రాళ్లు ఆ నేర ప్రపంచం నుండి ప్రాణాలతో బయటపడ్డారా ? అన్నదే ఈ సిరీస్ అసలు కథ.
Read Also : టీచర్ ను లైన్ లో పెట్టే స్టూడెంట్… రివేంజ్ అంటూ తపిస్తూనే… ఇదో రకం ప్రేమ