Crime Thriller OTT : విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్’ (Maargan)గత సంవత్సరం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సాధించింది. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం కుడా అందించారు. అతని భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీలో కుడా విడుదలై మంచి రెస్పాన్స్ పొందింది. అయితే ఇప్పుడు మరో ఓటీటీలో అడుగు పెట్టి ఆడియన్స్ కి మరింత దగ్గర అయింది సినిమా. ఈ వివరాలు ఏమిటో తలుసుకుందాం.
ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగు, తమిళ వెర్షన్ ఇదివరకే ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఆ తరువాత హిందీ డబ్బింగ్ వెర్షన్ జియో హాట్స్టార్లో వచ్చింది. తాజా అప్డేట్ ప్రకారం హిందీ వెర్షన్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో కూడా ప్రీమియర్ అయింది. మరొక ఓటీటీలో ప్లాట్ ఫామ్లో హిందీ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉండటం వల్ల, హిందీ ప్రేక్షకులలో ఈ సినిమా ప్రజాదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. 2025 జూన్ 27న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమాలో అజయ్ ధీషన్, సముద్రఖని, బ్రిగిడా, దీప్శిఖ, మహానతి శంకర్ లీడ్ రోల్స్ లో నటించారు.
హైదరాబాద్ నగరంలో రమ్య అనే ఒక అమ్మాయి దారుణంగా హత్యకు గురవడంతో కథ మొదలవుతుంది. ఆ హంతకుడు అమ్మాయి శరీరంలోకి ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తాడు. దీనివల్ల మరణించిన తర్వాత ఆ శరీరం మొత్తం నల్లగా మారిపోతుంది. ఆ తరువాత మరిన్ని ఇలాగే జరుగుతాయి. ఈ కేసును ఛేదించడానికి ముంబై అసిస్టెంట్ డీజీపీ ధ్రువ్ (విజయ్ ఆంటోనీ) నియమించబడతాడు. గతంలో తన కూతురు ప్రియ కూడా ఇదే తరహాలో హత్యకు గురవడంతో, ధ్రువ్ ఈ కేసును పర్సనల్ గా తీడుకుంటాడు. నిజానికి గతంలో హంతకుడిని పట్టుకునే క్రమంలో ధ్రువ్ శరీరంపై కూడా ఆ రసాయనం ప్రభావం పడటంతో, అతని శరీరంలో ఒక భాగం నల్లగా మారిపోయి ఉంటుంది. ఇక ఉత్కంఠభరితమైన ఈ ఇన్వెస్టిగేషన్ లో ధ్రువ్ కిల్లర్ ని కనిపడతాడా ? కిల్లర్ ఎందుకు అలా చంపుతున్నాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తలుసుకోవాల్సిందే.
Read Also : ఓటీటీలోకి రానున్న ఫిబ్రవరి మోస్ట్ అవైటింగ్ మలయాళం మూవీస్… ఏ మూవీ ఏ ఓటీటీలో ?