Kaantha OTT release : దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కాంత’. 1950 కాలం నాటి మద్రాస్లో ప్రముఖ నటుడు, అతని దర్శకుడు మధ్య జరిగే ఇగో క్లాష్ తో ఈ సినిమా రన్ అవుతుంది. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కి ముందే స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. అయితే థియేట్రికల్ రన్ తర్వాతనే ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. స్ట్రీమింగ్ డేట్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఇంతలోనే ఈ సినిమా వివాదాలలో కూడా నిలుస్తోంది. ఓ ప్రముఖ వ్యక్తి ఈ సినిమాపై కోర్టుకు వెళ్లారు. ఈ వివాదం ఏమిటి ? ఇది ఏ ఓటీటీలో రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘కాంత’ (Kaantha). ఇది 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇది డిసెంబర్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. దీనిని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. లోకా చాప్టర్ 1: చంద్ర’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దుల్కర్, ఇప్పుడు వచ్చే ఈ ‘కాంత’ సినిమాతో మరెన్ని రికార్డులు బద్ధలు కోడతాడో వేచి చూడాలి.
Read Also : 16 గంటలు పడుకునే వింత జబ్బు… బుర్రపాడు ట్విస్టులున్న కన్నడ థ్రిల్లర్
ఈ కథ తమిళ సినీ దిగ్గజం ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కిందనే ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర బృందం ఇది కల్పిత కథ అని స్పష్టం చేసింది. అయినా కూడా ఈ సినిమాలో మా తాత గారిని తప్పుగా చూపించారని, ఎం.కె. త్యాగరాజన్ మనవడు కోర్టు మెట్లు ఎక్కాడు. తన తాత అప్పుల్లో చనిపోయినట్లు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టు కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది. ఇక ఈ కథలో ఒక నటుడికి, తనను పరిచయం చేసిన దర్శకుడితో వివాదం మొదలవుతుంది. హీరో తన సొంత టాలెంట్ తోనే పైకి వచ్చానని చెప్పడంతో దర్శకుడి ఇగో హార్ట్ అవుతుంది. దర్శకుడు మాత్రం నేను డైరెక్ట్ చేయడం వల్లే నీకు ఇంత పేరు వచ్చిందని వాదనలు జరుగుతాయి. మధ్యలోవచ్చే మరిన్ని పాత్రలు కథని హైప్ కి తీసుకెళ్తాయి.