OTT Movie : ఈ ఏడాది వచ్చిన ఒక హిందీ థ్రిల్లర్ రొమాంటిక్ వెబ్ సిరీస్ టాప్ రేటింగ్ తో నడుస్తోంది. ఐయండిబి లో దీనికి 8.6/10 రేటింగ్ కూడా ఉంది. ఇది భార్యాభర్తల మధ్యలోకి ఒక వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ జంట పై ఒక రివేంజ్ ఒక గేమ్ ప్లాన్ రెడీ అవుతుంది. కుట్రలు, మోసాలతో ఈ సిరీస్ నడుస్తుంది. మొదట సరదాగా మొదలయ్యే ఈ కథ తర్వాత థ్రిల్లర్ వైబ్ ని ఇస్తుంది. దీని పేరు ఏంటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఎక్ అంజాన్ రిష్టే కా గిల్ట్ 4’ (Ek Anjaan Rishtey Ka Guilt 4) 2025లో వచ్చిన హిందీ థ్రిల్లర్ రొమాంటిక్ వెబ్ సిరీస్. షోయిబ్ నికాష్ షా దీనికి దర్శకత్వం వహించారు. . ఇందులో నవీనా బోలే, ఫైజాన్ భట్, తాని దేవల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 6 ఎపిసోడ్ లతో, 2025 ఫిబ్రవరి 13 నుంచి ShemarooMe ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 8.6/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళ్తే
రేహా, అంష్ సింగ్ అనే భార్యా భర్తలు డీప్ లవ్ లో ఉంటారు. కానీ వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఒక రోజు వాళ్లు విక్రమ్ అహూజా అనే రిచ్ వ్యక్తిని కలుస్తారు. విక్రమ్ వాళ్లతో ఒక 7 రోజుల ఒక గేమ్ ఆడమని చెబుతాడు. ఇందులో వాళ్ల ప్రేమకు పరీక్ష కూడా ఉంటుంది. రేహా, అంష్ ఈ గేమ్కు ఒప్పుకుంటారు. దాన్ని ఫన్గా భావిస్తారు. కానీ గేమ్ మొదలైన తర్వాత, విక్రమ్ వాళ్లను విడదీయడానికి ట్రై చేస్తాడు. ఈ గేమ్ వెనుక విక్రమ్ ఒక పాత ప్రతీకారం ఉందని తెలుస్తుంది. 7 రోజుల ఈ గేమ్లో రేహా, అంష్ విక్రమ్తో సమయం గడుపుతారు. విక్రమ్ చాలా తెలివిగా రేహాను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
Read Also : లేడీ డ్రైవర్ తో లేకి పనులు… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్… డోంట్ మిస్
దీంతో అంష్కు వీళ్ళ మీద జెలసీ వస్తుంది. ఈ గేమ్ వల్ల వాళ్ల మధ్య గొడవలు పెరుగుతాయి. విక్రమ్ ఈ గేమ్ను ఒక పాత గిల్ట్ కారణంగా ఆడుతున్నాడని తెలుస్తుంది. అది రేహా, అంష్ గతంతో ముడిపడి ఉంటుంది. రేహా, అంష్ ప్రేమ బలంగా ఉన్నా, విక్రమ్ వల్ల డేంజర్లో పడతారు. రేహా, అంష్ విక్రమ్ గేమ్ వెనుక అసలు నిజం కనుక్కుంటారు. విక్రమ్ పాత ప్రతీకారం కోసం ఈ గేమ్ ఆడాడని తెలుస్తుంది. ఇక ఈ క్లైమాక్స్ కూడా ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది. అసలు విక్రమ్ రివేంజ్ కి కారణం ఏమిటి ? రేహా, అంష్ విక్రమ్ ఉచ్చులో పడతారా ? ఈ జంట తమ ప్రేమను తిరిగి పొందుతారా ? అనే ప్రశ్నలకు సమాధానలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.