E-Paper
Advertisement

Holy Kashi Tour: మరో ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించిన IRCTC, ‘పవిత్ర కాశీ’ ప్యాకేజీ పేరుతో 4 పుణ్యక్షేత్రాల దర్శనం!

Holy Kashi Tour: మరో ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించిన IRCTC, ‘పవిత్ర కాశీ’ ప్యాకేజీ పేరుతో 4 పుణ్యక్షేత్రాల దర్శనం!

IRCTC Holy Kashi Tour:

ఆధ్యాత్మిక పర్యటనలను కోరుకునే పర్యాటకులకు IRCTC మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘పవిత్ర కాశీ’ టూర్ పేరుతో ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఇది ఉత్తర భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించేలా ప్లాన్ చేసింది. వారణాసి (ఉత్తర ప్రదేశ్), ప్రయాగ్‌రాజ్ (ఉత్తర ప్రదేశ్), అయోధ్య (ఉత్తర ప్రదేశ్), బోధ్ గయా (బీహార్)లో పర్యటించేలా రూపొందించింది. ఈ ప్యాకేజీ ప్రయాణికులను పురాతన దేవాలయాలు, పాత ఘాట్‌లు, బౌద్ధ  ప్రదేశాలకు తీసుకెళుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణించాలనుకునే వ్యక్తుల బడ్జెట్, ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్యాకేజీ రూపొందించబడింది. ఈ పర్యటనలో ప్రయాణికుల దర్శన టిక్కెట్లను కూడా IRCTC బుక్ చేయడం విశేషం.

ఈ టూర్ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే?

ఈ ప్యాకేజీ కోసం IRCTC పాయింట్ టు పాయింట్ ట్రావెట్ తో పాటు హోటల్ బసలు, సందర్శన కోసం స్థానిక కోచ్‌లు, ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు గైడెడ్ సందర్శనల కోసం విమాన కనెక్టివిటీని ఉపయోగిస్తోంది. ఈ పర్యటన కోయంబత్తూర్ లో ప్రారంభం అవుతుంది. 18 నవంబర్ 2025న పర్యటన షెడ్యూల్ చేయబడింది. 23 నవంబర్ 2025 వరకు (ఐదు రాత్రులు, ఆరు రోజులు) కొనసాగుతుంది.

నాలుగు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన

ఇక ఈ పర్యటనలో భాగంగా  భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన వారణాసి (కాశీ) సందర్శన ఉంటుంది.  ఐకానిక్ కాశీ విశ్వనాథ ఆలయానికి నిలయమైన ఈ నగరంలో సందర్శకులు  గంగా హారతి, పడవ ప్రయాణం, పాత నగర దారుల పర్యటించనున్నారు. ఆ తర్వాత కుంభమేళా జరిగిన త్రివేణి సంగమం అయిన ప్రయాగ్ రాజ్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత అయోధ్యలో అడుగు పెడతారు. కొత్తగా పునరుద్ధరించబడిన రామమందిరంతో అయోధ్య మరొక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది.  చివరగా ముఖ్యమైన బౌద్ధ తీర్థయాత్ర స్థలం బోధ్ గయాకు వెళ్తారు. ఇక్కడే గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు.

ప్యాకేజీ ధర

ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.39,750గా నిర్ణయించారు రైల్వే అధికారులు. నిర్దిష్ట బోర్డింగ్ పాయింట్లు, హోటల్ గది ఎంపిక చేసుకున్న పర్యాటకులకు వర్తించే ప్రాథమిక ధర ఇది. ఉన్నత స్థాయి(మెరుగైన హోటళ్ళు, ప్రైవేట్ క్యాబిన్లు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు) కావాలనుకునే వారికి ధర పెరుగుతుంది.

టూర్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?

IRCTC టూర్ ప్యాకేజీ కోసం బుకింగ్‌లను అధికారిక IRCTC టూరిజం పోర్టల్ ద్వారా చేయవచ్చు. అంతేకాదు, అధికారిక రైల్వే టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ల దగ్గర కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే బుకింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో టూరిస్టులు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. చివరి క్షణంలో వెళ్లాలి అనుకున్నా, టికెట్లు అందుబాటులో లేక ఇబ్బంది పడకూడదన్నారు. వీలైనం త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆధ్యాత్మిక పర్యటన చేసే అవకాశం ఉందన్నారు.

Read Also: మెట్రో రైల్లో చిన్నారుల డ్యాన్స్, చూస్తే ఫిదా కావాల్సిందే!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×