OTT Thriller Web Series : బాబీ డియోల్ ‘ఆశ్రమం’ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన సిరీస్. కానీ ఈ రోజు మనం అంతకు మించి అన్నట్లు ఉండే 5 అద్భుతమైన క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ గురించి తెలుసుకుందాం. వీటిలో ప్రతి సీన్ సస్పెన్స్తోనే నడుస్తాయి. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. చాలా కాలంగా వార్తల్లో నిలిచిన కొత్త సీజన్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ‘ఢిల్లీ క్రైమ్స్ 3’ లాంటి సిరీస్ లు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి సిరీస్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
జియో హాట్స్టార్లోని అత్యుత్తమ వెబ్ సిరీస్లలో ఒకటైన “స్పెషల్ ఆప్స్” రెండు భాగాలుగా విడుదలైంది. ఇవి రెండూ హిట్ అయ్యాయి. ఈ సిరీస్ మొదటి సీజన్ RAW ఏజెంట్ హిమ్మత్ సింగ్ కథను చూపిస్తుంది. రెండవ సీజన్ కథలో హిమ్మత్ సింగ్ అతని బృందం భారతదేశంపై చైనా ఒక పెద్ద సైబర్ దాడికి ప్లాన్ చేస్తుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఒక సీక్రెట్ మిషన్ను ప్రారంభింస్తారు. మొదటి సీజన్ 2020లో, రెండవ సీజన్ 2025న జూలై 11నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
జైదీప్ అహ్లవత్ నటించిన ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2020 లో విడుదలై సూపర్ హిట్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. 2025 జనవరి 17న పాతాళ్ లోక్ 2 ను కూడా విడుదల చేశారు. దీనిని కూడా ఆడియన్స్ తెగ చూడటం మొదలెట్టారు. ఈ కథలో జీవితం మీద విరక్తితో ఉన్న ఒక పోలీస్ కి అనుకోకుండా ఒక పెద్ద కేసు తగులుతుంది. దీంతో అతని జీవితంతో పాటు, కేసు రూపు రేకలు కూడా మారిపోతాయి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ 2025 నవంబర్ 21న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది. నటుడు మనోజ్ బాజ్పేయి శ్రీకాంత్ తివారీగా తిరిగి రానున్నారు. జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ కూడా ఈ సిరీస్ లో కనిపిస్తారు. దీని కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
‘ఢిల్లీ క్రైమ్స్’ సీజన్ 3 : 2025 నవంబర్ 13న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. DCP వర్తిక చతుర్వేది అమ్మాయిల అక్రమ రవాణా కేసును ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. 2012 బేబీ ఫలక్ కేసు నుండి ప్రేరణ పొందిన ఈ సీజన్, గాయాలతో హాస్పిటల్ లో వదిలేసిన ఒక చిన్న పాపతో మొదలవుతుంది. ఈ స్కాండిల్ కి ఒక లేడీ డాన్ హెడ్ గా ఉంటుంది. ఆమెను పట్టుకునే క్రమంలో ఈ సిరీస్ ఉత్కంఠ భరితంగా ఉంటుంది.
ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు అభిషేక్ చౌబే దర్శకత్వం వహించాడు. మనోజ్ బాజ్పేయ్, కొంకణా సేన్ శర్మ, సాయాజీ షిండే, నాజర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ ను, జనవరి 11న హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు. ఈ సిరీస్ లను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే అప్పడం కష్టమే.
Read Also : కోటి కట్టకపోతే ఇంట్లోంచి గెంటేస్తామని వార్నింగ్… ముసలావిడ మాస్టర్ ప్లాన్ కు హ్యాట్సాఫ్ భయ్యా