OTT Movie : నయనతార నటించిన ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు బెస్ట్ సజెషన్. కొరియన్ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ కథలో దుర్గ (నయనతార) అనే సీబీఐ ఆఫీసర్ ఓ ప్రమాదంలో కంటి చూపును కోల్పోతుంది. నగరంలో వరుసగా అమ్మాయిల కిడ్నాప్ లు జరుగుతుంటాయి. అందమైన అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ల చావును కళ్లారా చూసి ఆనందించే జేమ్స్ ఓ సైకో. పోలీసులకు చిక్కకుండా తిరిగే ఈ సైకో జేమ్స్ను అంధురాలైన దుర్గ ఎలా పట్టుకుంది అనేదే మిగతా సినిమా కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘నెట్రికన్’ (Netrikann) 2021లో తమిళంలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కొరియన్ చిత్రం ‘బ్లైండ్’కు రీమేక్గా నిర్మించారు. రౌడీ పిక్చర్స్, క్రోస్ పిక్చర్స్ బ్యానర్ల పై విఘ్నేష్ శివన్ నిర్మించిన ఈ సినిమాకు మిలింద్ రావ్ దర్శకత్వం వహించాడు. నయనతార పుట్టినరోజు సందర్భంగా నవంబరు 18న చిత్ర యూనిట్ నయనతార ఫస్ట్ లుక్, జూలై 29, 2021న ట్రైలర్ను విడుదల చేశారు. నయనతార, అజ్మల్, కె.మణికందన్, శరణ్శక్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 13న డిస్నీ+ హాట్స్టార్లో విడుదలైంది,
దుర్గా (నయనతార) ఒక మాజీ CBI ఆఫీసర్. ఒక రోడ్ అక్సిడెంట్లో కంటి చూపును కోల్పోతుంది. ప్రస్తుతం దుర్గా ఒక స్పెషల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పని చేస్తుంటుంది. అక్కడ బ్లైండ్ స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇస్తూ, లైఫ్ ను సాధారణంగా గడుపుతుంటుంది. కానీ ఒక రోజు ఆమె ఒక కిడ్నాప్ సీన్ చూస్తుంది. బ్లైండ్ అయినా, ఆమె శబ్దాలు, టచ్, స్మెల్ ద్వారా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారని అర్థం చేసుకుంటుంది. ఈ విషయాన్ని దుర్గా పోలీస్ లకు చెబుతుంది. కానీ వాళ్లు ఆమెను సీరియస్గా తీసుకోరు. “నువ్వు బ్లైండ్, ఎలా చూశావు?” అని ప్రశ్నిస్తారు. దుర్గా తన ఇంట్యూషన్తో కిడ్నాపర్ను ఫాలో చేస్తుంది. ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ అర్జున్ సహాయం తీసుకుంటుంది. అర్జున్ మొదట దుర్గాను ట్రస్ట్ చేయడు. కానీ ఆమె స్మార్ట్నెస్ చూసి ఆమెకు హెల్ప్ చేస్తాడు. వాళ్లు కిడ్నాప్డ్ అమ్మాయిని సేవ్ చేయడానికి ప్లాన్ చేస్తారు.
Read Also : అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఆ పాడు పని… పోలీసులకు చెమటలు పట్టించే మాస్క్ మ్యాన్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
దుర్గా బ్లైండ్ అయినా, ఆమె శబ్దాలు, స్మెల్స్ ద్వారా క్లూస్ కనుగొంటుంది. వాళ్లు కిడ్నాపర్ జాన్ అని తెలుసుకుంటారు. కానీ అతను ఒక సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. జాన్ మాజీ మిలిటరీ మ్యాన్, అతను మహిళలను కిడ్నాప్ చేసి చంపుతుంటాడు. దుర్గా, అర్జున్ కలిసి జాన్ను ట్రాప్ చేస్తారు, కానీ అతను ఎస్కేప్ అవుతాడు. ఇంతలో ఒక ట్విస్ట్ వస్తుంది. జాన్ కి దుర్గా పాస్ట్ అక్సిడెంట్తో కనెక్ట్ అయి ఉందని తెలుస్తుంది. అతను ఆమె కళ్లు పోగొట్టిన కిల్లర్ అని తెలిసి దుర్గా షాక్ అవుతుంది. అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. జాన్ పై దుర్గ రివేంజ్ తీర్చుకుంటుందా ? దుర్గని జాన్ ఎందుకు చంపాలనుకున్నాడు ? అతను మహిళల్ని ఎందుకు చంపుతున్నాడు ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి