E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయితో ఆ పాడు పని…ఆమె దగ్గరకెళ్ళిన ఏ మగాడూ తిరిగి వెళ్ళడు… కిక్కెక్కించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయితో ఆ పాడు పని…ఆమె దగ్గరకెళ్ళిన ఏ మగాడూ తిరిగి వెళ్ళడు… కిక్కెక్కించే మిస్టరీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కావలసిన జానర్లో సినిమాలు చూసే ఎంజాయ్ చేసే అవకాశం బాగా పెరిగింది మూవీ లవర్స్ కి. థియేటర్లకు వెళ్లే పని లేకుండా హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని, ఫ్యామిలీ అంతా ఎంచక్కా చూడాలనుకున్న సినిమాను చూడొచ్చు. ఇక బోర్ కొట్టిందో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల వైపు మళ్లుతుంది మనసు. ఇక ఓటీటీలో ఇలాంటి సినిమాలకు కొదవేమీ లేదు. ఈ జానర్లో సినిమాలను వెతుకుతున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఈ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ హిందీ సినిమా పేరు ‘పోషం పా’ (Posham Pa). ZEE5 ఒరిజినల్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. 2019 ఆగష్టులో విడుదలైంది. ఇందులో మహీ గిల్ (ప్రజక్త), సాయనీ గుప్తా (రేఘా సాథే), రాగిణీ ఖన్నా (శిఖా దేశ్‌పాండే), శివానీ రఘువంశీ, ఇమాద్ షా తదితరులు నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ZEE5, Airtel Xstream Playలో అందుబాటులో ఉంది. IMDbలో 6.2 రేటింగ్ తెచ్చుకున్న ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

కథలోకి వెళ్తే…
‘పోషం పా’ మూవీ 1990లో మహారాష్ట్రలో జరిగిన నిజమైన సిస్టర్స్ కేసు ఆధారంగా రూపొందింది. ఇది అంజనాబాయి గావిట్ (మహీ గిల్), ఆమె కుమార్తెలు సీమా గావిట్ (సాయనీ గుప్తా), రేణుకా షిండే (రాగిణీ ఖన్నా) చుట్టూ తిరుగుతుంది. “పోషం పా” అనే నర్సరీ రైమ్‌తో ప్రారంభమవుతుంది. వాళ్ళు 40 మందికి పైగా పిల్లలను కిడ్నాప్ చేసి, 12 మందిని హత్య చేశారు. కథ డాక్యుమెంటరీ స్టైల్‌లో సాగుతుంది. ఇద్దరు డాక్యుమెంటరీ మేకర్స్ (శివానీ రఘువంశీ, ఇమాద్ షా) ఈ మహిళల జీవితాలను, నేరాలను, ఆ అమ్మాయిల మానసిక స్థితిని, నేరాల వెనుక ఉన్న ఉద్దేశ్యాలను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు.

Read Also : ఫ్రీగా వచ్చింది కదాని కక్కుర్తి పడితే, అందంగా చంపేసే అద్దం… అల్టిమేట్ హర్రర్ మూవీ

Advertisement

తల్లి తన కుమార్తెలు రేఘా, శిఖాను నేర జీవితంలోకి లాగి, పిల్లలను కిడ్నాప్ చేసి… దొంగతనం, హత్యలు చేయమని బలవంతం చేస్తుంది. వారు బిచ్చగాళ్ల పిల్లలను లక్ష్యంగా చేసుకుని, ఉపయోగపడరని తెలిశాక హత్య చేస్తారు. చివరకు 1996లో వాళ్ళు అరెస్ట్ అవుతారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు చివరికి ఎలా ఎండ్ అయ్యింది ? సొంత తల్లే తన కూతుర్లతో ఇంతటి దారుణమైన పని ఎందుకు చేయించింది ? పిల్లలను కిడ్నాప్ చేసి ఏం చేసేవారు? ఎందుకు చంపారు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×