Psycho Thriller OTT : ఈ మధ్య కాలంలో సైకో కిల్లర్ స్టోరీలను అదరిస్తున్నారు ప్రేక్షకులు. సినిమాల నుంచి, వెబ్ సిరీస్ ల దాకా ఈ స్టోరీలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. రీసెంట్ గా ఓ హిందీ మూవీ ఇదే జానర్ లో రిలీజ్ అయింది. మూడు పార్ట్ లుగా వచ్చిన ఈ సిరీస్ కి మంచి ఆదరణ కూడా దక్కింది. అమ్మాయిలను దారుణంగా హత్య చేసే ఒక సైకో సీరియల్ కిల్లర్ను, శివానీ రాయ్ అనే లేడి పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నారనేది ఈ సినిమా కథ. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
2019లో వచ్చిన ఈ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మర్దాని 2’ (Mardaani 2). ఇది 2014లో వచ్చిన ‘మర్దాని’కి సీక్వెల్.
ఇందులో రాణి ముఖర్జీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్గా నటించారు. విలన్గా విశాల్ జెత్వా తన నటనతో అందరినీ భయపెట్టారు. ఈ సినిమాను ప్రస్తుతం Netflix ప్లాట్ ఫామ్లో చూడవచ్చు. ఈ సిరీస్లో మూడవ భాగం ‘మర్దాని 3’ (Mardaani 3) ఇటీవల 2026 జనవరి 30న థియేటర్లలో విడుదలైంది.
రాజస్థాన్లోని కోటా నగరంలో 21 ఏళ్ల సన్నీ (విశాల్ జెత్వా) అనే సైకో అమ్మాయిలను కిడ్నాప్ చేసి, వారిపై దారుణంగా అఘాయిత్యం చేసి హత్య చేస్తుంటాడు. ఈ నేరాలను చాలా పకడ్బందీగా చేస్తూ, పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడటమే కాకుండా, తనను పట్టుకోమని పోలీసులకే సవాల్ విసురుతుంటాడు. ఈ కేసును డీల్ చేయడానికి ఎస్పీ శివానీ రాయ్ (రాణి ముఖర్జీ) రంగంలోకి దిగుతుంది. అయితే ఈ కేసు అంతా తేలికగా మాత్రం సాగదు. సన్నీ చాలా తెలివైన వాడు. ప్రతిసారీ వేషాలు మారుస్తూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుంటుంటాడు. శివానీ తన ఇన్వెస్టిగేషన్లో వాడికి దగ్గరవుతున్న కొద్దీ, వాడు ఇంకా రెచ్చిపోయి ఆమె పరువు తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ శివానీ అస్సలు తగ్గదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, వాడు ఎంతలా బురిడీ కొట్టించినా సరే, తన తెలివితేటలతో వాడిని ఎలా పట్టుకుని బుద్ధి చెప్పింది అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. శివానీ రాయ్ ప్రాణాలకు తెగించి పోరాడే సీన్స్ ఈ సినిమాలో హైలెట్ గా ఉంటాయి.