Ramayana OTT: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ (Nithesh Tiwari) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi)సీతగా, కన్నడ హీరో యశ్ రావణాసురుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి భాగం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమాలో రాముడి పాత్రను పరిచయం చేస్తూ.. చిత్రబృందం ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇక దీంతో సినిమాపై బజ్ ఊహించని విధంగా పెరిగిపోయింది.
ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ ఆహార్యం ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది . ముఖ్యంగా అయోధ్యలోకి రాముడు ఎంట్రీ ఇచ్చే సీన్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటుడు యశ్ రావణాసురుడిగా నటించడమే కాకుండా ఆయన ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రెండు భాగాలను కలిపి సుమారుగా 4 వేల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే రెండు భాగాలుగా విడుదల కానున్న రామాయణ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏకంగా 1000 కోట్ల వరకు చెల్లించడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ ను నిర్మాత నమిత్ మల్హోత్రా సున్నితంగా తిరస్కరించి, ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
ALSO READ:Rashmika: పెళ్లయిన తర్వాత రష్మిక ఖాతాలో అరుదైన ఘనత.. సంతోషంలో ఫాన్స్!
అసలు విషయంలోకి వెళ్తే.. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్త సామర్థ్యం పై ఉన్న గట్టి నమ్మకం వల్లే ఆయన ఈ ఒప్పందాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. రామాయణ సినిమాతో వెంటనే లభించే ఆర్థిక లాభం కోసం కాకుండా ఈ ప్రాజెక్టును చలనచిత్ర దృశ్యంగా తీర్చిదిద్దడం పై దృష్టి సారిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని అనేక దేశాలలో విడుదల చేసి మరింత లాభాన్ని పొందే దిశగా నిర్మాత అడుగులు వేస్తున్నట్లు సమాచారం.. ఇకపోతే ఈ 1,000 కోట్ల ఓటీటీ ఆఫర్ ను కాదనడంతో అటు సినీ వర్గాలు ఆశ్చర్యపోయినా.. ఈ ప్రాజెక్టుపై చిత్ర నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోంది అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ఈ సినిమాలో నటిస్తున్న భారీ తారాగణం.. మరొకవైపు ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచుతుంటే.. ఇప్పుడు ఇంత భారీ ఓటీటీ ఆఫర్ ని కూడా నిర్మాతలు తిరస్కరించడంతో అంచనాలు తారస్థాయికి చేరిపోతున్నాయి . మరి దీపావళి సందర్భంగా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి.