E-Paper
Advertisement

OTT Movie : స్కూల్ కెళ్లే అమ్మాయితో పాడు పని… ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని తెలిశాక వాడికి ఉంటది… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : స్కూల్ కెళ్లే అమ్మాయితో పాడు పని… ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని తెలిశాక వాడికి ఉంటది… అల్టిమేట్ యాక్షన్ సీన్స్
Advertisement

OTT Movie : విశాల్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈయనగారి సినిమాలకు తమిళ్, తెలుగులో కూడా అభిమానులున్నారు. అయితే గత ఏడాది విశాల్ నటించిన ఒక సినిమా యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటోంది. ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా బాగానే వర్క్ అవుట్ అయింది. ఈ సినిమా మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌తో నిండి ఉంటుంది. యాక్షన్, ఎమోషనల్ సినిమాని ఇష్టపడే వాళ్ళు దీనిపై ఓ లుక్ వేయండి. ఒక చిల్లింగ్ థ్రిల్ ను ఇస్తుంది. ఈ సినిమా పేరు ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

‘రత్నం’ (Rathnam) హరి డైరెక్ట్ చేసిన తమిళ యాక్షన్ డ్రామా సినిమా. ఇందులో విశాల్ (రత్నం), ప్రియా భవానీ శంకర్ (లోగనాయగి ), సముద్రకని (పన్నీర్ సెల్వం) మెయిన్ రోల్స్‌లో నటించారు. తమిళనాడు-ఆంధ్ర సరిహద్దులో జరిగే ఈ కథ రౌడీయిజం, అమ్మ సెంటిమెంట్, రివెంజ్, ల్యాండ్ మాఫియాల చుట్టూ తిరుగుతుంది. ఇది 2024 ఏప్రిల్ 26న థియేటర్స్‌లో వచ్చింది. ఇప్పుడు Amazon Prime Video, Zee Tamilలో తమిళం, తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ సినిమా 2 గంటల 35 నిమిషాల నిడివితో IMDb లో 5.4/10 రేటింగ్ ను పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

1990లలో రాయుడు సోదరులు – బీమా, సుబ్బా, రాఘవ బస్సు ప్రయాణీకులను దోచి, చంపేసే గ్యాంగ్‌గా ఉంటారు. లోగనాయగి ఒక పోలీస్ ఆఫీసర్ భార్య, వీళ్ల క్రైమ్స్ గురించి పోలీసులకు చెబుతుంది. రివెంజ్‌లో రాయుడు సోదరులు ఆమె భర్తని చంపేస్తారు. లోగనాయగి వాళ్ళనుంచి తప్పించుకుని, తన కొడుకు రత్నంతో మార్కెట్‌లో బతుకుతుంది. కానీ స్థానిక వేశ్యాగృహ ఓనర్ ఆమెను వేధించి, చివరకు ఆమెను వేశ్యగా ముద్రవేసి అరెస్ట్ చేయిస్తాడు. అవమానంతో లోగనాయగి పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకుంటుంది. రత్నం అప్పటికి చిన్న పిల్లాడిగానే, ఆ వేశ్యాగృహ ఓనర్‌ని చంపి, జైలుకు వెళ్తాడు. జైలు నుండి బయటకు వచ్చిన రత్నం, పన్నీర్ సెల్వం అనే ఒక ఎమ్మెల్యే కోసం రౌడీగా పనిచేస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు రత్నం పన్నీర్‌ని ఒక దాడి నుండి కాపాడి ఉంటాడు. ఇక రత్నం పన్నీర్ కోసం గుండాలను కొడుతూ బతుకుతాడు. ఒక రోజు మల్లిగ అనే యువతి, రాయుడు సోదరుల గుండాలచే దాడికి గురవుతుంది. రత్నం ఆమెను కాపాడతాడు. ఎందుకంటే మల్లిగ తన అమ్మ లోగనాయగిలా కనిపిస్తుంది.

Read Also : పర్వతంపై అమ్మాయి మృతదేహం… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ

మల్లిగ తన ఫ్యామిలీకి చెందిన 5.5 ఎకరాల ల్యాండ్‌ని రాయుడు సోదరులు కబ్జా చేయాలని చూస్తున్నారని చెబుతుంది. ఈ ల్యాండ్ విషయంలో మల్లిగ తాత, తల్లిదండ్రులు రాయుడు సోదరులను రిజెక్ట్ చేయడంతో, వాళ్లు మల్లిగను చంపాలని ప్లాన్ చేస్తారు. రత్నం, మల్లిగను కాపాడటానికి సుబ్బా రాయుడుని చంపేస్తాడు. తర్వాత రత్నం తన అమ్మ గతాన్ని తెలుసుకుంటాడు. రాయుడు సోదరులు తన తల్లి సోదరులేనని, వాళ్లు తన తండ్రిని చంపి, తల్లిని వేధించారని తెలుస్తుంది. రత్నం రాఘవ రాయుడుని, బీమా రాయుడుని కూడా చంపేస్తాడు. చివర్లో మల్లిగ తన ల్యాండ్‌ని గవర్నమెంట్‌కి ఇచ్చేసి, మెడికల్ కాలేజ్ కోసం ఉపయోగిస్తుంది. రత్నం తన చర్యలకు పోలీసులకు లొంగిపోతాడు, మల్లిగకు తన పేరు గుర్తుండాలని రత్నం కోరుకుంటాడు.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×