OTT Movie : అండర్వరల్డ్ అనే పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది ముంబై. ఇప్పటికీ అక్కడ నేరాలను తమ కనుసన్నల్లో జరిగేలా చుస్తుంటారు గ్యాంగ్ స్టర్లు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్, ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డులలో కూడా దూసుకుపోయింది. 2023 ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డులలో 10 నామినేషన్లను సాధించి, ఉత్తమ డ్రామా సిరీస్, ఉత్తమ నటి (కరిష్మా తన్నా)తో సహా 4 అవార్డులను గెలుచుకుంది. ఇది రియల్ సంఘటనల ఆధారంగా రూపొందింది. 2011లో క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయ్ హత్య కేసులో, జిగ్నా వోరా ఎదుర్కొన్న ఆరోపణల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
నెట్ఫ్లిక్స్లో
‘స్కూప్’ (Scoop) హిందీ భాష క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్. దీనిని హన్సల్ మెహతా, మృణ్మయీ లగూ వైకుల్ సృష్టించి, దర్శకత్వం వహించారు. ఈ సిరీస్లో కరిష్మా తన్నా, మహ్మద్ జీషాన్ అయ్యూబ్, హర్మన్ బవేజా ప్రధాన పాత్రల్లో నటించారు, ప్రోసెంజిత్ చటర్జీ, నేహా మిశ్రా, తనిష్ఠా చటర్జీ, మరియు దేవేన్ భోజనీ సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సిరీస్ 2023 జూన్ 2, నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. సిరీస్ ఆరు ఎపిసోడ్లను కలిగి ఉంది, ప్రతి ఎపిసోడ్ సుమారు ఒక గంట పాటు ఉంటుంది.
కథలోకి వెళ్తే
స్కూప్ జాగృతి పాఠక్ ఒక ఆత్మవిశ్వాసం ఉండే క్రైమ్ రిపోర్టర్. ఆమె ముంబైలోని ఒక వార్తాపత్రిక డిప్యూటీ బ్యూరో చీఫ్గా పనిచేస్తుంటుంది. జాగృతి భర్తతో విడాకులు తీసుకుని, తన కొడుకు, తల్లిదండ్రులు, తాతతో కలిసి ఒక చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తుంటుంది. ఆమె జీవితంలో ఏకైక లక్ష్యం తన కెరీర్లో రాణించడం, పెద్ద స్కూప్లను పొందడం. తద్వారా ఆమె కథనాలు పత్రిక మొదటి పేజీలో స్థానం సంపాదించడం. ఈ సిరీస్ ముంబైలో సీరియల్ బాంబు పేలుళ్లపై ఒక రిపోర్ట్ ను ఇవ్వాలనుకుంటుంది. ఆమె తన వృత్తిలో ఎదుగుతున్నప్పుడు, ఆమె ముఖ్యంగా అండర్వరల్డ్ తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటుంది. ఇది ఆమె సహోద్యోగుల మధ్య అసూయ, అనుమానాలను పెంచుతుంది.
అయితే JCP హర్షవర్ధన్ ష్రాఫ్ అనే పోలీసు అధికారి ఆమెకు సమాచారం అందించే ముఖ్య వ్యక్తిగా ఉంటాడు. జాగృతి ఆత్మవిశ్వాసం, ఆమె విజయాలను చూసి, దీపా చంద్ర అనే ఆమె సహోద్యోగికి, ఆమె పట్ల అసూయ కలుగుతుంది. కథలో ఒక మలుపు వచ్చే సంఘటన ఏమిటంటే, ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ జైదేబ్ సేన్, గ్యాంగ్స్టర్ చోటా రాజన్ ఆదేశాల మేరకు బహిరంగంగా హత్య చేయబడతాడు. జాగృతి, ఈ సంఘటనను కవర్ చేయడానికి కాశ్మీర్ నుండి తిరిగి ముంబైకి వస్తుంది. కానీ ఆమె అండర్వరల్డ్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో, ఆమె ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా మారుతుంది. పోలీసులు, మీడియా, అండర్వరల్డ్ మధ్య ఈ సమస్యలో చిక్కుకుంటుంది.
ఆమెను ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొనేలా చేస్తుంది. ఆమె ఖ్యాతి, కెరీర్, కుటుంబ జీవితం నాశనమవుతాయి. ఆమె బైకుల్లా జైలుకి వెళ్తుంది. జైలులో ఆమె ఇతర ఖైదీలతో సమస్యలను ఎదుర్కొంటుంది. ఆమె కుటుంబం ఆమెకు మద్దతుగా నిలుస్తుంది. కొంతమంది సహోద్యోగులు ఆమె నిర్దోషిత్వాన్ని నమ్ముతారు. ఆమె కేసును పరిశీలించడానికి ప్రయత్నిస్తారు. జాగృతి తన న్యాయవాది సహాయంతో, తన కేసును ఎదుర్కొంటుంది. చివరకు ఆమెపై ఆరోపణలు ఎదుర్కొనే సమయంలో నిజం బయటకు వస్తుంది. ఈ నిజం ఏమిటి ? ఈ హత్య కేసులో ఎలా చిక్కుకుంది ? జాగృతి ఇందులో నుంచి ఎలా బయటపడుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.
Read Also : పడుచు పిల్లతో పాడు పనులు… కల్లోనూ అదే యావ… మస్ట్ వాచ్ మలయాళ కాంట్రవర్సీ డ్రామా