Pallavi Prashanth : బుల్లితెరపై టాప్ రియాల్టీ షో అంటే తక్కువని గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. ఈ షోలోకి అడుగుపెట్టి ఎంతోమంది తమ పాపులారిటీని పెంచుకున్నారు. మరి కొంతమంది తమకున్న ఇమేజ్ ని డామేజ్ చేసుకున్నారు. అయితే ఈ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన కామన్ మ్యాన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు.. విన్నర్ గా ట్రోఫీన్ అందుకున్న ప్రశాంత్ ఆ తర్వాత ఎక్కడ కనిపించినా హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. తాజాగా ప్రశాంత్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే..
రైతు బిడ్డకు పోలీసులు షాక్..
బిగ్ బాస్ విన్నర్ అయ్యాక పల్లవి ప్రశాంత్ రైతులకు ఇచ్చిన మాటన పక్కనపెట్టినట్లు సోషల్ మీడియా లో తెగ వినిపిస్తుంది. ఇక ఈ మధ్య ఈయన పెడుతున్న రీల్స్ కొందరికి కోపాన్ని తెప్పిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ మాట తప్పడంటూ సోషల్ మీడియాలో వార్తలు ఇప్పటికీ ఆగడం లేదు.. రైతుల పేరుతో ఇతను చేసిన మోసం అలాంటి కాబట్టి.. ఇతను కనిపిస్తే చాలు ఇతనికి సపోర్ట్ చేసిన వాళ్లంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాజాగా పల్లవి ప్రశాంత్ పెట్టిన పోస్ట్ జనాలని కోపానికి గురయ్యేలా చేస్తున్నాయి. ఇది పక్కన పెడితే..బైక్పై పోజులు ఇస్తూ.. ఓ బ్రాండ్ని ప్రమోట్ చేశాడు. ఆ బ్రాండ్, ఆ పత్తేపారాలను పక్కనపెడిడే..ఫొటో షూట్లో మనోడు పోజులు ఇచ్చిన బైక్పై చాలానే చలాన్లు ఉన్నాయి. దాంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
Also Read : ఈ వారం ఘోరంగా పడిపోయిన రేటింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి ఏంటి..?
ఏం జరిగిందంటే..?
పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ ను సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఎక్కువగా రీల్స్ చేస్తున్నాడు. కొన్ని చిన్న యాడ్స్ చేస్తున్నాడు. చిన్న చిన్ని షాప్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ ప్రమోషన్స్లో భాగంగా.. దిగిన ఫొటో షూట్ ఇతన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.. ఇతను బైకు మీద అదిరిపోయే ఫోటో షూట్ చేశాడు. కానీ షూట్ చేసేముందు బైక్ని ఉపయోగిస్తున్నారన్నప్పుడు.. ఆ బైక్ నెంబర్ క్లియర్గా కనిపిస్తుందన్నప్పుడు.. ఆ బైక్ ఎవరిదో దానిపై పెండింగ్ చలాన్లు ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పోలీసులు అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో చూడాలి..
పల్లవి ప్రశాంత్ రైతులను మోసం చేశాడా..?
బిగ్ బాస్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ రైతుల కష్టం చూస్తున్నాను.. ఆ బాధ నాకు తెలుసు అని మాటలు చెప్పాడు. ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు పైసాతో సహా పంచిపెట్టేస్తానని.. ఆలెక్కలు మొత్తం పైసాతో సహా.. లెక్కలు చెప్తానని చెప్పి.. తీరా టైటిల్ గెలిచిన తరవాత మొహం చాటేశాడు పల్లవి ప్రశాంత్.. అదే ఇప్పటికీ వినిపిస్తుంది..